నాని హీరోగా రూపొందుతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ…
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా…
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కొద్ది నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలకు అధిక సమయం పడుతోందని రాహుల్ సాంకృత్యన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన నాని, సాయిపల్లవి, కృతీశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దసరా సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలోని నాని…
విభిన్న కథలతో తెలుగు సినీ ప్రేమికులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ‘టక్ జగదీష్’ అనే ఫామిలీ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ మూవీకి సిద్ధమయ్యాడు. దసరా కానుకగా నాని తన 29వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్టర్ విడుదల చేసి ఆసక్తిని పెంచేశాడు. అక్టోబర్ 15న…
టాలీవుడ్ యంగ్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నాని. ‘జెర్సీ’తో నటుడుగా విమర్శకుల ప్రశంసలు పొందినా… కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కొట్టలేక పోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీశ్’ వరుసగా నిరాశ పరిచాయి. మధ్యలో నిర్మాతగా ‘హిట్’తో విజయం సాధించినా నటుడుగా మాత్రం సక్సెస్…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని సినిమాను చూసేసాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాపై తన అభిప్రాయం ఏంటో కూడా ఇందులో వెల్లడించాడు. “రిపబ్లిక్ చూసాను… సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై దయ చూపించాడు. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగొచ్చింది.…
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో మల్టీస్టారర్ కు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రానా. అయితే మరో యంగ్ హీరోతో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి రానా సిద్దమయ్యాడు. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్, రానా కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ రూపొందనుంది అనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న…
2021 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాలలో ‘మానాడు’ ఒకటి. దర్శకుడు వెంకట్ ప్రభు శింబుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ కామట్చి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తవ్వగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ…
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై, సినిమా ఇండస్ట్రీ సమస్యలపై, టికెట్ రేట్లు, ఆన్లైన్ టికెట్ విధానం, ఏపీలో థియేటర్ల సమస్యలు, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం తీరుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక పనిలో పనిగా సినిమా ప్రముఖులకు కూడా పవన్ చురకలు…