ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు
అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు.…
ఆపిల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.
Narhari Zirwal: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మంత్రాలయ భవనంపై నుంచి దూకారు. సమాచారం ప్రకారం, నరహరి జిర్వాల్ మంత్రిత్వ శాఖలోని మూడవ అంతస్తు నుండి దూకాడు. ఆయనతో పాటు ఎమ్మెల్యే హిరామన్ ఖోస్కర్ కూడా దూకేసాడు. అయితే రక్షణ కోసం ఏర్పాటు చేసిన వల వల్ల వారి ప్రాణం కాపాడబడింది. గిరిజన ఎమ్మెల్యేలిద్దరూ ఉచ్చులో చిక్కుకోవడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటకు తీశారు. ఎత్తు నుంచి కిందపడటంతో జిర్వాల్ మెడపై గాయమైంది.…
Irani Cup 2024: ముంబై ‘రన్ మెషిన్’గా పేరొందిన సర్ఫరాజ్ ఖాన్ లక్నోలోని ఎకానా స్టేడియంలో రెస్ట్ ఆఫ్ ఇండియాపై అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆరో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ 149 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరిలో 14 ఫోర్లు కొట్టి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. ఫస్ట్క్లాస్లో ఇప్పటివరకు 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత…
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
Terror Threats In Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేశారు.
Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Western Railway TC: వెస్ట్రన్ రైల్వేలో పని చేస్తున్న టిక్కెట్ కలెక్టర్ (TC) ఆశిష్ పాండే మరాఠీ లేదా ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ముంబైలో తీవ్ర వివాదం కొనసాగుతుంది.
Brazil Woman Arrested: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరపరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు.