Irani Cup 2024: మ్యాచ్ డ్రా అయినా.. ఛాంపియన్గా నిలిచిన ముంబై
- ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న ముంబై
- ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా
- లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్
- 27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. కాగా.. ముంబై 27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు 1997–98లో ముంబై టైటిల్ గెలుచుకుంది. అయితే మ్యాచ్ డ్రా అయినప్పటికి ముంబై ఎందుకు ఛాంపియన్గా నిలిచిందనేది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం..
Samsung Galaxy S24 Ultra: ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్లో శాంసంగ్ ఫోన్పై భారీ ఆఫర్..
Also Read
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది..
ఇరానీ కప్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ డ్రా అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారనేది ఇరానీ కప్లో నిబంధన. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఆధిక్యం ఉన్న జట్టును ఛాంపియన్గా ప్రకటిస్తారు. తద్వారా రెస్ట్ ఆఫ్ ఇండియాపై తొలి ఇన్నింగ్స్లో 121 పరుగుల ఆధిక్యంతో ముంబై ఇరానీ కప్ ట్రోఫీని చేజిక్కించుకోవడంలో విజయవంతమైంది. ఐదో రోజు ముంబై తరఫున తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్కు 158 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోటియన్ 150 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 114 పరుగులు చేశాడు. అవస్తి 93 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో అజేయంగా 51 పరుగులు చేశాడు.
CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు..
ముంబై బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించాడు. 286 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ అజేయంగా 222 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 25 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 17 పరుగులు మాత్రమే చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున శరాన్ష్ జైన్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అభిమన్యు ఈశ్వర్ 191 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధృవ్ జురెల్ (93) మినహా అవతలి ఎండ్ నుండి అతనికి మద్దతు లభించలేదు. వీరిద్దరూ ఐదో వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శామ్స్ ములాని 40 ఓవర్లలో 122 పరుగులిచ్చి మూడు వికెట్లు, కొటియన్ 27 ఓవర్లలో 101 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!