Irani Cup 2024: మ్యాచ్ డ్రా అయినా.. ఛాంపియన్గా నిలిచిన ముంబై
- ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న ముంబై
- ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా
- లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్
- 27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. కాగా.. ముంబై 27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు 1997–98లో ముంబై టైటిల్ గెలుచుకుంది. అయితే మ్యాచ్ డ్రా అయినప్పటికి ముంబై ఎందుకు ఛాంపియన్గా నిలిచిందనేది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం..
Samsung Galaxy S24 Ultra: ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్లో శాంసంగ్ ఫోన్పై భారీ ఆఫర్..
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది..
ఇరానీ కప్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ డ్రా అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారనేది ఇరానీ కప్లో నిబంధన. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఆధిక్యం ఉన్న జట్టును ఛాంపియన్గా ప్రకటిస్తారు. తద్వారా రెస్ట్ ఆఫ్ ఇండియాపై తొలి ఇన్నింగ్స్లో 121 పరుగుల ఆధిక్యంతో ముంబై ఇరానీ కప్ ట్రోఫీని చేజిక్కించుకోవడంలో విజయవంతమైంది. ఐదో రోజు ముంబై తరఫున తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్కు 158 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోటియన్ 150 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 114 పరుగులు చేశాడు. అవస్తి 93 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో అజేయంగా 51 పరుగులు చేశాడు.
CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు..
ముంబై బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించాడు. 286 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ అజేయంగా 222 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 25 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 17 పరుగులు మాత్రమే చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున శరాన్ష్ జైన్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అభిమన్యు ఈశ్వర్ 191 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధృవ్ జురెల్ (93) మినహా అవతలి ఎండ్ నుండి అతనికి మద్దతు లభించలేదు. వీరిద్దరూ ఐదో వికెట్కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శామ్స్ ములాని 40 ఓవర్లలో 122 పరుగులిచ్చి మూడు వికెట్లు, కొటియన్ 27 ఓవర్లలో 101 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!