Mumbai: మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ.. విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు
- ముంబైలో మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ
- విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. వారితో అనేక విషయాలు ముచ్చటించారు. అంతేకాకుండా ‘లాడ్కీ బహిన్’ పథకం లబ్ధిదారులు, కార్మికులతో కూడా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
మెట్రో రైలుతో పాటు మెట్రో కనెక్ట్-3 యాప్ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లు ప్రధాని వెంట ఉన్నారు. బీకేసీ- ఆరే మధ్య మొత్తం పది మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, సహర్ రోడ్ సహా మరి కొన్ని ప్రాంతాలను ఈ మార్గం కలుపుతుంది.

ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా అధికారం కోసం ఛేజ్కించుకోవాలని ఆశపడుతోంది. ఈ రెండు కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
विद्यार्थी, तरुण, मुख्यमंत्री माझी लाडकी बहिण योजनेचे लाभार्थी आणि मेट्रोची उभारणी करणाऱ्या कामगारांशी संवाद साधून आनंद झाला. pic.twitter.com/Nfi4m2Eb8W
— Narendra Modi (@narendramodi) October 5, 2024
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!