Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్యకేసులో మూడో నిందితుడు అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో
- అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు.
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ..
- మరో ముగ్గురు పరారీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Siddique Murder: అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ పోస్ట్ చేసిన శుభం సోంకర్ సోదరుడు ప్రవీణ్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. పుణెకు చెందిన 28 ఏళ్ల ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మారణకాండలో ముగ్గురిలో ఇద్దరు షూటర్లకు ప్రవీణ్, అతని సోదరుడు సహకరించారని సమాచారం. ప్రవీణ్ సోదరుడు శుభం లోంకర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారి ప్రకారం ప్రవీణ్, శుభం ఇద్దరు షూటర్లకు సహాయం చేసారు. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23) అనే మరో షూటర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ
Also Read
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
శుభం లోంకర్ కోసం పోలీసులు పూణే వెళ్లారని, అయితే అక్కడ అతడు కనిపించలేదని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఈ నేరానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతని సోదరుడు ప్రవీణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ హత్య కేసులో ఆరుగురు నిందితుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు ధరమ్రాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్, ప్రవీణ్ లోంకర్ ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, మిగిలిన జాసిన్ అక్తర్, శివ ప్రసాద్ గౌతమ్, శిబు లోంకర్ ముగ్గురు పరారీలో ఉన్నారు.
Karnataka: బైక్ మెకానిక్కి రూ. 25 కోట్ల లాటరీ.. ట్యాక్స్ ఎంతో తెలుసా?
ఆదివారం మధ్యాహ్నం క్రైమ్ బ్రాంచ్ గుర్మైల్ సింగ్ (23), ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19)లను కోర్టులో హాజరుపరిచారు. నిందితులకి 14 రోజుల రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరగా, దానిని కోర్టు అంగీకరించింది. నిందితుడు గుర్మెల్ను కోర్టు 14 రోజుల కస్టడీకి పంపింది. కాగా, నిందితుడు ధరమ్రాజ్ కశ్యప్ను ఆసిఫికేషన్ పరీక్ష తర్వాత మళ్లీ హాజరు కావాలని కోరారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్ నగర్లో శనివారం రాత్రి ఎన్సీపీ (అజిత్ వర్గం) నాయకుడు బాబా సిద్ధిఖీపై ఆయన ఎమ్మెల్యే కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సంఘటన తర్వాత, అతన్ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!