Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్యకేసులో మూడో నిందితుడు అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో
- అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు.
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ..
- మరో ముగ్గురు పరారీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Siddique Murder: అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ పోస్ట్ చేసిన శుభం సోంకర్ సోదరుడు ప్రవీణ్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. పుణెకు చెందిన 28 ఏళ్ల ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మారణకాండలో ముగ్గురిలో ఇద్దరు షూటర్లకు ప్రవీణ్, అతని సోదరుడు సహకరించారని సమాచారం. ప్రవీణ్ సోదరుడు శుభం లోంకర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారి ప్రకారం ప్రవీణ్, శుభం ఇద్దరు షూటర్లకు సహాయం చేసారు. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23) అనే మరో షూటర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ
Also Read
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
శుభం లోంకర్ కోసం పోలీసులు పూణే వెళ్లారని, అయితే అక్కడ అతడు కనిపించలేదని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఈ నేరానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతని సోదరుడు ప్రవీణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ హత్య కేసులో ఆరుగురు నిందితుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు ధరమ్రాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్, ప్రవీణ్ లోంకర్ ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, మిగిలిన జాసిన్ అక్తర్, శివ ప్రసాద్ గౌతమ్, శిబు లోంకర్ ముగ్గురు పరారీలో ఉన్నారు.
Karnataka: బైక్ మెకానిక్కి రూ. 25 కోట్ల లాటరీ.. ట్యాక్స్ ఎంతో తెలుసా?
ఆదివారం మధ్యాహ్నం క్రైమ్ బ్రాంచ్ గుర్మైల్ సింగ్ (23), ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19)లను కోర్టులో హాజరుపరిచారు. నిందితులకి 14 రోజుల రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరగా, దానిని కోర్టు అంగీకరించింది. నిందితుడు గుర్మెల్ను కోర్టు 14 రోజుల కస్టడీకి పంపింది. కాగా, నిందితుడు ధరమ్రాజ్ కశ్యప్ను ఆసిఫికేషన్ పరీక్ష తర్వాత మళ్లీ హాజరు కావాలని కోరారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్ నగర్లో శనివారం రాత్రి ఎన్సీపీ (అజిత్ వర్గం) నాయకుడు బాబా సిద్ధిఖీపై ఆయన ఎమ్మెల్యే కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సంఘటన తర్వాత, అతన్ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!