Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్యకేసులో మూడో నిందితుడు అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో
- అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు.
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ..
- మరో ముగ్గురు పరారీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Siddique Murder: అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ పోస్ట్ చేసిన శుభం సోంకర్ సోదరుడు ప్రవీణ్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. పుణెకు చెందిన 28 ఏళ్ల ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మారణకాండలో ముగ్గురిలో ఇద్దరు షూటర్లకు ప్రవీణ్, అతని సోదరుడు సహకరించారని సమాచారం. ప్రవీణ్ సోదరుడు శుభం లోంకర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారి ప్రకారం ప్రవీణ్, శుభం ఇద్దరు షూటర్లకు సహాయం చేసారు. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23) అనే మరో షూటర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ
Also Read
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
శుభం లోంకర్ కోసం పోలీసులు పూణే వెళ్లారని, అయితే అక్కడ అతడు కనిపించలేదని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఈ నేరానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతని సోదరుడు ప్రవీణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ హత్య కేసులో ఆరుగురు నిందితుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు ధరమ్రాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్, ప్రవీణ్ లోంకర్ ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, మిగిలిన జాసిన్ అక్తర్, శివ ప్రసాద్ గౌతమ్, శిబు లోంకర్ ముగ్గురు పరారీలో ఉన్నారు.
Karnataka: బైక్ మెకానిక్కి రూ. 25 కోట్ల లాటరీ.. ట్యాక్స్ ఎంతో తెలుసా?
ఆదివారం మధ్యాహ్నం క్రైమ్ బ్రాంచ్ గుర్మైల్ సింగ్ (23), ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19)లను కోర్టులో హాజరుపరిచారు. నిందితులకి 14 రోజుల రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరగా, దానిని కోర్టు అంగీకరించింది. నిందితుడు గుర్మెల్ను కోర్టు 14 రోజుల కస్టడీకి పంపింది. కాగా, నిందితుడు ధరమ్రాజ్ కశ్యప్ను ఆసిఫికేషన్ పరీక్ష తర్వాత మళ్లీ హాజరు కావాలని కోరారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఖేర్ నగర్లో శనివారం రాత్రి ఎన్సీపీ (అజిత్ వర్గం) నాయకుడు బాబా సిద్ధిఖీపై ఆయన ఎమ్మెల్యే కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సంఘటన తర్వాత, అతన్ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..