ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. సకినాకా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైనర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు
పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిపై బాలుడు పదే పదే కత్తితో దాడికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు పాల్పడుతుండగా.. అక్కడే ఉన్న కొంతమంది ఆపలేకపోయారు. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ దాడికి సంబంధించి అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. మృతుడు…
హిజాబ్, బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉన్న ముంబైలోని ఓ ప్రైవేట్ కాలేజీ సూచనలను సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీని నిర్వహిస్తున్న 'చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ'కి నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు
ముంబై ఆస్పత్రిలో ఓ కార్మికుడు నీచానికి పాల్పడ్డాడు. మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా కిటికీలోంచి మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జయేష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Maharashtra Assembly Elections: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టి షాక్ ఇచ్చింది. త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవి పునరాభివృద్ధి ఇప్పుడు ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, కొత్తగా ఏర్పడిన ధారవి, దాని పరిసరాల నివాసితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న సర్వేకు తన మద్దతును అందించింది.
Jewelry Shop Robbery In Mumbai Viral video: మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఏకంగా రూ. 11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులు నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారని…
భారతదేశం-మాల్దీవుల మధ్య సంబంధాలలో హెచ్చు తగ్గుల నేపథ్యంలో.. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ నేటి నుంచి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ సమయంలో.. అతను భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి.