I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాశారు. ఐ బొమ్మ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి అనుమానాలు వ్యక్తం చేసింది. రవి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతా నుండి 3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్…
మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. వీరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మాజీ క్రికెటర్లు ఇద్దరూ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet ను ప్రోత్సహించారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఆన్లైన్ బెట్టింగ్ సైట్ 1xBet పై కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్ కు…
Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది.…
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
Anil Ambani in Trouble: భారతదేశ కుబేరుడిగా వెలుగొందిన రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా అనిల్ అంబానీతో సంబంధం ఉన్న పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలను కోరింది. ఈ బ్యాంకుల జాబితాలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఆంగ్లపత్రిక ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్రాజ్ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్రాజ్ స్టేట్ మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో రానా ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకి ఆయనను ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ED ఆదేశించింది. ఈ రోజు (జులై 23, 2025) ED ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, రానా సమయం కోరడంతో మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. బెట్టింగ్ యాప్స్తో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేస్తోంది.…
Rana : హీరో దగ్గుబాటి రానా బెట్టింగ్ యాప్స్ కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. ఆ రోజే విచారణకు రావాలంటూ రానాతో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్లకు నోటీసులు ఇచ్చింది. రేపు అంటే జులై 23న ఉదయం రానా విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ ఆదేశించింది. అయితే తాజాగా రానా దీనిపై స్పందించారు. తనకు ముందే ఫిక్స్ అయిన వరుస…
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్లో ఉంటున్న…