Anil Ambani-ED: అంబానీకి మరిన్ని కష్టాలు.. ఆ బ్యాంకులకు ఈడీ నోటీసులు!
- అనిల్ అంబానీకి మరిన్ని కష్టాలు
- మనీలాండరింగ్ కేసులో అంబానీ పాత్రపై దర్యాప్తు
- 5న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ambani in Trouble: భారతదేశ కుబేరుడిగా వెలుగొందిన రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా అనిల్ అంబానీతో సంబంధం ఉన్న పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలను కోరింది. ఈ బ్యాంకుల జాబితాలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఆంగ్లపత్రిక ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యూకో బ్యాంక్, సింద్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నట్లు పేర్కొంది. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చాయి. ఈ సంస్థలకు ఇచ్చిన అప్పుల్లో ఎంతకు తిరిగి చెల్లించని కేసుల్లో భాగంగా కొందరు అధికారులకు ఈడీ నోటీసులు జారి చేసింది. ఈడీ ఆయా అధికారులను లోన్ క్లియరెన్స్కు సంబంధించి అనుసరించిన విధివిధాలను అడిగినట్లు సమాచారం.
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 5న అనిల్ అంబానీ విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ను కూడా ఇచ్చింది. ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేయనుంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు కూడా రాబోయే రోజుల్లో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది.
Also Read
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
- Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
- CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
Also Read: Revanth Reddy-Komatireddy: మళ్లీ సీఎం కావాలని పూజలు చేశా.. సీఎం, మంత్రి ఫోన్ కాల్ వైరల్!
యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు లభించిన రూ.3,000 కోట్ల రుణంపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. బిస్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పార్థసారధి బిస్వాల్ను గత వారం రూ.3,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న కారణంగా అరెస్టు చేశారు. ఈక్రమంలో ఆయనపై పీఎంఎల్ఎ చట్టాన్ని ప్రయోగించారు. రిలయన్స్ పవర్ కోసం దాదాపు రూ.68.2 కోట్లకు తప్పుడు హామీ పత్రాలను సమర్పించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
-
Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
-
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!