Minister Narayana: విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్వర్ణాంధ్ర 2047 సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి మురికివాడల రహిత నగరంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25…
Minister Narayana: నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. పనుల్లో అలసత్వం వహిస్తే సహించం.. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి.. ప్రతీ లే అవుట్ లో పార్కుకు స్థలం వదలాలి.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టాము.
విశాఖపట్నం అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయం తర్వాత మాత్రమే వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం స్వార్ధ పూరితంగా ఆలోచించి వైజాగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని విమర్శించారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి, భూ సమస్యలుపై విశాఖ ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు. నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్న చంద్రబాబు కుటుంబం. తిరుమల: నేడు జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల.. ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్…
రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత... రుణం ఎంత అనేది చర్చించి చెబుతాం. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం.
7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయి. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచాం.. వాటిలో గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. కేవలం గత ప్రభుత్వం 57 వేల ఇళ్ల నిర్మాణం చేసింది.. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు. పార్కులు. స్కూళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
Minister Narayana: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 45వ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014- 19లో 43 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం..
రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని.. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు..
స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీల్లో బీజేపీ తరపున సీనియర్ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు నామినేషన్ వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారం ఆశీర్వాదం కోరడం జరిగింది.. బీజేపీ సిద్ధాంతంతో పార్టీ విస్తరణ కోరకు నిరంతరం సోము వీర్రాజు సేవలు అందిస్తున్నారు.. ఎమ్మెల్సీ స్థానానికి సరైన అభ్యర్థిగా అతడ్ని ఎన్నుకోవడం…