Minister Narayana: ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు విజయవాడలో జరుగుతోంది.. వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలని అన్నారు.. అలాగే కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం అన్నారు.. ఏ మునిసిపాలిటీ కలెక్షన్ ఆ మునిసిపాలిటీలోనే వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు.. వచ్చే మార్చి నాటికి 80 శాతానికి పైగా కలెక్షన్లు జరిగిపోవాలన్నారు.. కుక్కల స్టెరిలైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మునిసిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలి.. కలెక్షన్లు లేనిదే మనం ఏమీ చేయలేం.. 2014-19 మధ్యలో అండర్ అసెస్మెంట్లు రెగ్యులరైజ్ చేయలేదు.. అప్పట్లో రాష్ట ఖజానా బాగానే ఉండేది… ప్రతీ వారం కలెక్షన్ గురించి నేను అడుగుతూనే ఉంటాను.. ట్యాక్స్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని స్పష్టం చే శారు..
Read Also: PM Modi: రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
స్వచ్ఛ ఆంధ్ర, మునిసిపాలిటీలు 50-50 విధానంలో మెషీన్లు కొనాలి.. రాబోయే రోజుల్లో అంతా మెకనైజ్డ్ విధానాలే… రాబోయే రెండేళ్ళలో మునిసిపల్ బిల్డింగ్ లు కట్టే ఆలోచన లేదన్నారు మంత్రి నారాయణ.. చాలాకాలంగా ఉండిపోయిన చెత్త అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలి.. AAB, AMRUTH లు కూడా జరగాలి అన్నారు.. కుక్కలకు వేక్సినేషన్ పూర్తిస్ధాయిలో జరగాలి.. గుంటూరులో చిన్న పిల్లాడి మరణం చాలా దారుణం.. కుక్కల స్టెరిలైజేషన్ అనేది ప్రధాన అంశంగా మీరు పూర్తి చేయాలి.. వేసవి నీటి ఎద్దడి కష్టం రాకుండా అందరూ చూడాలి… బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు రాకుండా చూడాలి అని ఆదేశించారు మంత్రి నారాయణ..
Read Also: Gorantla Madhav: జగన్పై దాడి చేయాలనే కుట్ర.. మా అనుమానం అదే..!
ఇక, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరంలో మునిసిపల్ కమీషనర్లు ఏం చేయాలి అనేది ఇవాళ వర్క్ షాప్ లో ఇవ్వడం జరుగుతుంది.. ఇవాళ ఇచ్చే విధానాల ఆధారంగా మునిసిపల్ కమీషనర్ల రివ్యూ జరుగుతుంది.. నగర జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుంది .. ఆస్థిపన్ను వసూలు చేయడం ప్రధాన టార్గెట్గా ఉండాలన్నారు.. వసూలు చేసిన ఆస్థిపన్ను ఆయా మునిసిపాలిటీలే వినియోగించుకోవచ్చు.. మార్చి 30 నాటికి 80% పైగా రెవెన్యూ కలెక్షన్ ఉండాలి అని స్పష్టం చేశారు..