Minister Narayana: కలెక్షన్స్ లేకపోతే ఏమీ చేయలేం.. మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూపై ఫోకస్ పెట్టాలి..!
- ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు..
- వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ..
- మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలి..
- కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు విజయవాడలో జరుగుతోంది.. వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలని అన్నారు.. అలాగే కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం అన్నారు.. ఏ మునిసిపాలిటీ కలెక్షన్ ఆ మునిసిపాలిటీలోనే వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు.. వచ్చే మార్చి నాటికి 80 శాతానికి పైగా కలెక్షన్లు జరిగిపోవాలన్నారు.. కుక్కల స్టెరిలైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మునిసిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలి.. కలెక్షన్లు లేనిదే మనం ఏమీ చేయలేం.. 2014-19 మధ్యలో అండర్ అసెస్మెంట్లు రెగ్యులరైజ్ చేయలేదు.. అప్పట్లో రాష్ట ఖజానా బాగానే ఉండేది… ప్రతీ వారం కలెక్షన్ గురించి నేను అడుగుతూనే ఉంటాను.. ట్యాక్స్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని స్పష్టం చే శారు..
Read Also: PM Modi: రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
స్వచ్ఛ ఆంధ్ర, మునిసిపాలిటీలు 50-50 విధానంలో మెషీన్లు కొనాలి.. రాబోయే రోజుల్లో అంతా మెకనైజ్డ్ విధానాలే… రాబోయే రెండేళ్ళలో మునిసిపల్ బిల్డింగ్ లు కట్టే ఆలోచన లేదన్నారు మంత్రి నారాయణ.. చాలాకాలంగా ఉండిపోయిన చెత్త అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలి.. AAB, AMRUTH లు కూడా జరగాలి అన్నారు.. కుక్కలకు వేక్సినేషన్ పూర్తిస్ధాయిలో జరగాలి.. గుంటూరులో చిన్న పిల్లాడి మరణం చాలా దారుణం.. కుక్కల స్టెరిలైజేషన్ అనేది ప్రధాన అంశంగా మీరు పూర్తి చేయాలి.. వేసవి నీటి ఎద్దడి కష్టం రాకుండా అందరూ చూడాలి… బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు రాకుండా చూడాలి అని ఆదేశించారు మంత్రి నారాయణ..
Read Also: Gorantla Madhav: జగన్పై దాడి చేయాలనే కుట్ర.. మా అనుమానం అదే..!
ఇక, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరంలో మునిసిపల్ కమీషనర్లు ఏం చేయాలి అనేది ఇవాళ వర్క్ షాప్ లో ఇవ్వడం జరుగుతుంది.. ఇవాళ ఇచ్చే విధానాల ఆధారంగా మునిసిపల్ కమీషనర్ల రివ్యూ జరుగుతుంది.. నగర జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుంది .. ఆస్థిపన్ను వసూలు చేయడం ప్రధాన టార్గెట్గా ఉండాలన్నారు.. వసూలు చేసిన ఆస్థిపన్ను ఆయా మునిసిపాలిటీలే వినియోగించుకోవచ్చు.. మార్చి 30 నాటికి 80% పైగా రెవెన్యూ కలెక్షన్ ఉండాలి అని స్పష్టం చేశారు..
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!