Minister Narayana: కలెక్షన్స్ లేకపోతే ఏమీ చేయలేం.. మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూపై ఫోకస్ పెట్టాలి..!
- ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు..
- వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ..
- మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలి..
- కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు విజయవాడలో జరుగుతోంది.. వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలని అన్నారు.. అలాగే కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం అన్నారు.. ఏ మునిసిపాలిటీ కలెక్షన్ ఆ మునిసిపాలిటీలోనే వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు.. వచ్చే మార్చి నాటికి 80 శాతానికి పైగా కలెక్షన్లు జరిగిపోవాలన్నారు.. కుక్కల స్టెరిలైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మునిసిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలి.. కలెక్షన్లు లేనిదే మనం ఏమీ చేయలేం.. 2014-19 మధ్యలో అండర్ అసెస్మెంట్లు రెగ్యులరైజ్ చేయలేదు.. అప్పట్లో రాష్ట ఖజానా బాగానే ఉండేది… ప్రతీ వారం కలెక్షన్ గురించి నేను అడుగుతూనే ఉంటాను.. ట్యాక్స్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని స్పష్టం చే శారు..
Read Also: PM Modi: రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
స్వచ్ఛ ఆంధ్ర, మునిసిపాలిటీలు 50-50 విధానంలో మెషీన్లు కొనాలి.. రాబోయే రోజుల్లో అంతా మెకనైజ్డ్ విధానాలే… రాబోయే రెండేళ్ళలో మునిసిపల్ బిల్డింగ్ లు కట్టే ఆలోచన లేదన్నారు మంత్రి నారాయణ.. చాలాకాలంగా ఉండిపోయిన చెత్త అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలి.. AAB, AMRUTH లు కూడా జరగాలి అన్నారు.. కుక్కలకు వేక్సినేషన్ పూర్తిస్ధాయిలో జరగాలి.. గుంటూరులో చిన్న పిల్లాడి మరణం చాలా దారుణం.. కుక్కల స్టెరిలైజేషన్ అనేది ప్రధాన అంశంగా మీరు పూర్తి చేయాలి.. వేసవి నీటి ఎద్దడి కష్టం రాకుండా అందరూ చూడాలి… బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు రాకుండా చూడాలి అని ఆదేశించారు మంత్రి నారాయణ..
Read Also: Gorantla Madhav: జగన్పై దాడి చేయాలనే కుట్ర.. మా అనుమానం అదే..!
ఇక, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరంలో మునిసిపల్ కమీషనర్లు ఏం చేయాలి అనేది ఇవాళ వర్క్ షాప్ లో ఇవ్వడం జరుగుతుంది.. ఇవాళ ఇచ్చే విధానాల ఆధారంగా మునిసిపల్ కమీషనర్ల రివ్యూ జరుగుతుంది.. నగర జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుంది .. ఆస్థిపన్ను వసూలు చేయడం ప్రధాన టార్గెట్గా ఉండాలన్నారు.. వసూలు చేసిన ఆస్థిపన్ను ఆయా మునిసిపాలిటీలే వినియోగించుకోవచ్చు.. మార్చి 30 నాటికి 80% పైగా రెవెన్యూ కలెక్షన్ ఉండాలి అని స్పష్టం చేశారు..
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..