తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో మోసం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్, తెలంగాణకి ప్రతి విషయంలోనూ ద్రోహం చెయ్యడమే బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతి రాష్ట్ర బీజేపీ నేతా, తెలంగాణకు వ్యతిరేకులేనని విమర్శించారు. స్టేట్ బీజేపీ లీడర్లకు దమ్ముంటే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదియ్యాలని సవాల్ విసిరారు కేటీఆర్. Read Also:…
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. ఏ చర్చకైనా మేం సిద్ధం అన్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో రైతు వేదిక ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చని పంటపొలాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు. దేశంలో ఒక్క రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ఉంది.. దేశంలో ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా ఉంటే మేము రాజీనామా చేస్తామని సవాల్…
రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వేములవాడలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు షుగర్ ఉందని సీక్రెట్ రివీల్ చేశారు. తాను షుగర్ పరీక్షలు చేసుకోవడం వల్ల 16 ఏళ్ల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని కేటీఆర్ తెలిపారు. దీంతో అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనకు షుగర్ ఉందని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నేడు ములుగులో మంత్రి హరీశ్రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12: 30 గంటలకు వేములవాడ టౌన్ తిప్పాపురం 100 పడకల ఆసుపత్రి, హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ ట్యాంక్, సీటీ స్కాన్, పల్లీయేటివ్ కేర్ సెంటర్, పీఎస్ఏ ప్లాంట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అంతేకాకుండా పిడియాట్రిక్ వార్డ్ ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ పట్టణంలో టీయూఎఫ్ఐడిసి…
తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి (RuB) రూ. 29.10 కోట్లతో శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నాలుగు దిశలలో అభివృద్ధి చెందుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ కదలికలను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని నిర్ధారించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డిపి) కింద ఈ ప్రయత్నాలలో భాగంగా తుకారాం గేట్ రూబిని నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), రైల్వేశాఖ నిధులతో అండర్ బ్రిడ్జితోపాటు అప్రోచ్ రోడ్డు…
ఈనెల 6,7,8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ సంబురాలకు రెడీ అవుతోంది. 6వ తేదీన సంబురాలు ప్రారంభం అవుతాయి. కేసీఆర్ కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం వుంటుందని టీఆర్ఎస్ తెలిపింది. కేసీసఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలయిన…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, సౌకర్యాలు కల్పించామని తెలిపారు.…
అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్…