నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు. నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3…
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ టవర్స్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. ఎన్నో ఓటములు, ఒడిదుడుకులు ఎదుర్కొని… ఈనాడు ఇంతటి స్థాయికి కేసీఆర్ వచ్చారని ఆయన అన్నారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి… లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమించాలని ఆయన అన్నారు. చేసే పనిలో పట్టుదల, సంకల్పం ఉండాలని, ఐటీ నలుమూలలా విస్తరించాలని.. గ్రిడ్ తీసుకొచ్చామన్నారు. ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి.. ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు.…
నిజామాబాద్ పర్యటనలో బీజేపీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు. బీజేపీ నేతలు విషం చిమ్మకుండా విషయాలు…
బహదూర్పురా వద్ద ఆరు-లేన్ల ద్విదిశాత్మక ఫ్లైఓవర్ వేగంగా పూర్తవుతోంది. ఈ సౌకర్యం దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని వేధిస్తున్న ట్రాఫిక్ గందరగోళాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉందని, మార్చి 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహదూర్పురా ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ రూ.69 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. 690-మీటర్ల…
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, అతి త్వరలో అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు…
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు.…
హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగర నలుమూలల విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ కంపెనీలను నగరానికి అన్ని దిశల్లో విస్తరించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే…
హైదరాబాద్లోని రైల్వే క్రాసింగ్లపై చేపట్టే పనులకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. నగరంలోని పలు రైల్వే క్రాసింగ్ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీలు (రూబీలు), రోడ్ ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబీలు) నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశంలో రైల్వే శాఖతో కలిసి పని చేయాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్),…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రోడ్లు వేయాలని, నాలాలను అభివృద్ధి చేయాలని, పట్టాలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించాలని భావిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పట్టాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రోడ్లు మూసేయడం దురదృష్టకరం. మరియు స్కైవేలు మరియు రోడ్ల విస్తరణ కోసం భూమిని కేటాయించలేదు.”అని…
మహాత్మా గాంధీ చూపించిన బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 2001లోని ఓ పేపర్ క్లిప్పింగ్ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. కరీంనగర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అంటూ అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి పత్రికలో వచ్చిన వార్తను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆనాడు కేసీఆర్ అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. కానీ ఆనాడు కేసీఆర్ చేసిన…