మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది.
Security for The Tree: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ చెట్టును కంటికి రెప్పలా కాపాడుతోంది. దీనికి చుట్టూ కంచె, రక్షణగా సాయుధులైన నలుగురు గార్డులు 24 గంటలకు చెట్టుకు చూసుకుంటున్నారు. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏకంగా లక్షల్లో వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు నీరు పోసేందుకు రూ.64 లక్షలు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ రైసెన్ లోని సాంచి స్థూపం సమీపంలో ఈ చెట్టును నాటారు. దీనికి పగలు, రాత్రి సెక్యూరిటీ ఇస్తున్నారు.
Canada sanctions Gotabaya, Mahinda Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహీందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు విధించింది. దేశంలో అంతర్యుద్ధం సమయంలో ‘‘మానవహక్కుల’’ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలఅపై వీరిద్దరిపై ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో నలుగురికి కూడా ఇదే ఆంక్షలను వర్తింపచేసింది. స్టాఫ్ సార్జెంట్ సునీల్ రత్నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ చందనా పి హెట్టియారచ్చితేలపై కూడా ఆంక్షలు విధించినట్లు కెనడా విదేశాంగ శాఖ తెలిపింది.
Srilanka Crisis- Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు సింగపూర్ లో ఉండేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గొటబాయ రాజపక్స సింగపూర్ లో టూరిస్ట్ వీసాపై నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి బంధుల గుణవర్థన మాట్లాడుతూ.. గొటబాయ రాజపక్స ఎన్నో రోజులు సింగపూర్ లో ఉండలేడని.. త్వరలోనే శ్రీలంకకు వస్తారని అన్నారు.
Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి
ప్రపంచీకరణ తర్వాత యువకుల్లో కెరీరిజం పెరిగింది. ధర్నాలు, ఆందోళనలు తగ్గిపోయాయి. రాజకీయ భావజాలం అంతరించిపోతోంది. ఇది చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శ్రీలంక నిరూపించింది. పాలకులంతా శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. ప్రజలు మంచి వాళ్లే. అయితే అతి పేదరికం ఆకలిలోకి నెడితే మాత్రం వెంటపడి తరుముతారు. శ్రీలంకలో జరుగుతున్నది ఇదే. దీనికి పరిష్కారం కూడా అంత సులభం కాదు. కొత్తగా ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అప్పులిచ్చిన సంస్థలన్నీ…
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. రాజపక్స పారిపోయేందుకు అక్కడి మిలిటరీ సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం రాజీనామా చేస్తానని వెల్లడించి రాజపక్స, ప్రజల తిరుగుబాటుతో పరారయ్యారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం నుంచి శ్రీలంకలో మళ్లీ భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. దీంతో పరిస్థితిని గమనించిన రాజపక్స కొలంబోలోని తన అధ్యక్ష అధికారిక నివాసం నుంచి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ భారీ సూటికేసులతో దేశం…
శ్రీలంక ప్రజా ఉద్యమంతో అట్టుడుకుతోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని శనివారం పెద్ద ఎత్తున రాజధాని కొలంబోలో ప్రజలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ఉద్యమంతో అధ్యక్షభవనం నుంచి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారు. అధ్యక్ష భవనాన్ని, ఆయన కార్యాలయాన్ని ఆందోళకారులు ఆక్రమించారు. గొటబాయ రాజీనామా చేసేవరకు అధ్యక్ష భవనాన్ని విడిచి వెళ్తేది లేదంటూ వేలాదిగా నిరసనకారులు అక్కడే మకాం వేశారు. ఇదిలా ఉంటే శ్రీలంక అధ్యక్షుడు…
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ప్రజలు రోడ్లపైకి వచ్చిన తన నిరసన తెలుపుతున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. ముఖ్యంగా అధ్యక్షడు గొటబయ రాజపక్సను గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజల ఆందోళలతో ప్రధాని పదవికి మహిందా రాజపక్సే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తీవ్ర పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది. ఇదిలా ఉంటే తనపై వచ్చిన వ్యతిరేఖతను తొలగించుకునేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవల ప్రధానిగా రణిల్…