Srilanka Economic Crisis: మళ్లీ స్వదేశానికి గొటబాయ రాజపక్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
కేబినెట్ అధికార ప్రతినిధి రందుల గుణవర్థన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అజ్ఞాతంలో లేరని.. ఆయన తిరిగి శ్రీలంకకు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే గొటబాయ రాజపక్స తిరిగి వచ్చే అవకాశం గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. తీవ్ర నిరసన, ఆందోళన మధ్య అధ్యక్ష భవనం నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స.. జూలై 14న ప్రైవేట్ విజిట్ కోసం సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రభుత్వం రాజపక్సకు 14 రోజుల స్వల్పకాలిక పాస్ మంజూరు చేసింది. సింగపూర్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గొటబాయ రాజపక్స తమను ఎలాంటి ఆశ్రయం కోరలేదని.. ఎటువంటి ఆశ్రయం ఇవ్వడం లేదని తెలిపింది.
Also Read
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
Read Also: Electricity bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు.. ఆస్పత్రి పాలైన యజమాని
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్టుకు చెందిన న్యాయవాదులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన రాజపక్సను వెంటనే అరెస్ట్ చేయాలని సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కూడా గుణవర్థన స్పందించారు. అదుపులోకి తీసుకునే పరిస్థితి ఏర్పడితే.. సింగపూర్ ప్రభుత్వం మాజీ అధ్యక్షుడికి ఎలాంటి హాని కలుగకుండా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
మహిందా రాజపక్స 2005 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రక్షణ కార్యదర్శిగా పనిచేసిన గొటబాయ రాజపక్స, శ్రీలంకలో ఎల్టీటీఈని దారుణంగా అణచివేశాడు. దీంతో అతనికి యుద్ధవీరుడనే బిరుదు కూడా వచ్చింది. అయితే ఈ సమయంలో తమిళులపై అనేక మానవహక్కుల ఉల్లంఘన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2019లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న గొటబాయ రాజపక్స.. దేశాధినేత హోదాలో విచారణ నుంచి మినహాయింపు పొందాడు. తాజాగా ఆయన పదవికి రాజీనామా చేయడంతో అతడిని విచారించే అవకాశం ఏర్పడింది.
తాజావార్తలు
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!