Srilanka Economic Crisis: మళ్లీ స్వదేశానికి గొటబాయ రాజపక్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
కేబినెట్ అధికార ప్రతినిధి రందుల గుణవర్థన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అజ్ఞాతంలో లేరని.. ఆయన తిరిగి శ్రీలంకకు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే గొటబాయ రాజపక్స తిరిగి వచ్చే అవకాశం గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. తీవ్ర నిరసన, ఆందోళన మధ్య అధ్యక్ష భవనం నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స.. జూలై 14న ప్రైవేట్ విజిట్ కోసం సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రభుత్వం రాజపక్సకు 14 రోజుల స్వల్పకాలిక పాస్ మంజూరు చేసింది. సింగపూర్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గొటబాయ రాజపక్స తమను ఎలాంటి ఆశ్రయం కోరలేదని.. ఎటువంటి ఆశ్రయం ఇవ్వడం లేదని తెలిపింది.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
Read Also: Electricity bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు.. ఆస్పత్రి పాలైన యజమాని
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్టుకు చెందిన న్యాయవాదులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన రాజపక్సను వెంటనే అరెస్ట్ చేయాలని సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కూడా గుణవర్థన స్పందించారు. అదుపులోకి తీసుకునే పరిస్థితి ఏర్పడితే.. సింగపూర్ ప్రభుత్వం మాజీ అధ్యక్షుడికి ఎలాంటి హాని కలుగకుండా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
మహిందా రాజపక్స 2005 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రక్షణ కార్యదర్శిగా పనిచేసిన గొటబాయ రాజపక్స, శ్రీలంకలో ఎల్టీటీఈని దారుణంగా అణచివేశాడు. దీంతో అతనికి యుద్ధవీరుడనే బిరుదు కూడా వచ్చింది. అయితే ఈ సమయంలో తమిళులపై అనేక మానవహక్కుల ఉల్లంఘన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2019లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న గొటబాయ రాజపక్స.. దేశాధినేత హోదాలో విచారణ నుంచి మినహాయింపు పొందాడు. తాజాగా ఆయన పదవికి రాజీనామా చేయడంతో అతడిని విచారించే అవకాశం ఏర్పడింది.
తాజావార్తలు
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!