Security for The Tree: చెట్టుకు నలుగురు పోలీసులతో సెక్యూరిటీ.. లక్షల్లో ఖర్చు.. ఇంతకీ ఆ చెట్టు ప్రత్యేకత ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security for The Tree: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ చెట్టును కంటికి రెప్పలా కాపాడుతోంది. దీనికి చుట్టూ కంచె, రక్షణగా సాయుధులైన నలుగురు గార్డులు 24 గంటలకు చెట్టుకు చూసుకుంటున్నారు. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏకంగా లక్షల్లో వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు నీరు పోసేందుకు రూ.64 లక్షలు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ రైసెన్ లోని సాంచి స్థూపం సమీపంలో ఈ చెట్టును నాటారు. దీనికి పగలు, రాత్రి సెక్యూరిటీ ఇస్తున్నారు.
Read Also: Immoral Relationship : ప్రియుడిని అన్నయ్య అంది.. అతడి చేతిలోనే హతమైంది
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
అసలు ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో తెలుసా..? అది ఓ బోధి వృక్షం. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన చెట్టుగా ప్రసిద్ధి చెందింది. దాదాపుగా 2500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడికి గయాలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది. 250 బీసీఈలో అశోక చక్రవర్తి ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాడు. అశోకుడు ఆ చెట్టు కొమ్మను రాజు దేవానాంప్రియ తిస్సాకు బహుమతిగా ఇచ్చి శ్రీలంక పంపాడు. అతడు దాన్ని తన రాజధాని అనురాధపురలో నాటాడు.
అయితే 2012లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే ఆ చెట్టు కొమ్మను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో సలామత్ పూర్ సమీపంలో కొండపై నాటారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ చెట్టుకు రక్షణ ఇస్తోంది. ఇప్పటి వరకు చెట్టుకు నీళ్లు పోయడానికే రూ.64 లక్షలు ఖర్చు అయ్యాయి. దాదాపుగా నెలకు ఈ చెట్టు నిర్వహణకు లక్షల్లో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఆకు గొంగళి పురుగు సోకి చెట్టుకు తెగుళ్లు వస్తున్నాయి. అయితే ఈ చెట్టు సంరక్షణకు హర్టీకల్చర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!