Srilanka Crisis: గొటబాయ రాజపక్స సోదరులకు మరో షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో రాజవక్స కుటుంబానికి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రజల ఆగ్రహానికి గురైన గొటబాయ రాజపక్స దేశం దాటి పోరిపోయారు. ఇప్పుడు ఆయన సోదరులైన మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్సలు దేశం దాటి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో జులై 28 వరకు దేశం దాటి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. మహింద రాజపక్స, బసిల్ రాజపక్సలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
శ్రీలంక దేశం ఆర్థికంగా చితికిపోవడానికి రాజపక్స సోదరుల అవినీతి పాలనే కారణమని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే వారిని గద్దె దింపేలా నిరసనలు చేపట్టారు. వారి ఆగ్రహానికి మొదట మహింద రాజపక్స ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అనంతరం అధ్యక్షుడిగా ఉన్న గొటబాయను పీఠంపై నుంచి దింపేందుకు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ఆ తీవ్రతను గ్రహించిన అధ్యక్షుడు గొటబాయ అధ్యక్ష నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాల్దీవులకు, అక్కడి నుంచి సింగపూర్కు పారిపోయారు. సింగపూర్కు వెళ్లిన అనంతరం తన రాజీనామాను స్పీకర్కు పంపించారు. బసిల్ రాజపక్స కూడా పారిపోదామని ప్రయత్నించగా.. విమానాశ్రయంలో ప్రజలు అడ్డుకోవడంతో దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది, గొటబాయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Also Read
Karnataka: కిక్ బాక్సింగ్లో విషాదం.. సింగిల్ పంచ్కు యువ బాక్సర్ మృతి
అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు. జులై 19న నామినేషన్లు స్వీకరించనున్నామని స్పీకర్ వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. జులై 20 ఎన్నిక జరగనుందని తెలిపింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!