Srilanka Crisis: గొటబాయ రాజపక్స సోదరులకు మరో షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో రాజవక్స కుటుంబానికి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రజల ఆగ్రహానికి గురైన గొటబాయ రాజపక్స దేశం దాటి పోరిపోయారు. ఇప్పుడు ఆయన సోదరులైన మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్సలు దేశం దాటి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో జులై 28 వరకు దేశం దాటి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. మహింద రాజపక్స, బసిల్ రాజపక్సలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
శ్రీలంక దేశం ఆర్థికంగా చితికిపోవడానికి రాజపక్స సోదరుల అవినీతి పాలనే కారణమని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే వారిని గద్దె దింపేలా నిరసనలు చేపట్టారు. వారి ఆగ్రహానికి మొదట మహింద రాజపక్స ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అనంతరం అధ్యక్షుడిగా ఉన్న గొటబాయను పీఠంపై నుంచి దింపేందుకు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ఆ తీవ్రతను గ్రహించిన అధ్యక్షుడు గొటబాయ అధ్యక్ష నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాల్దీవులకు, అక్కడి నుంచి సింగపూర్కు పారిపోయారు. సింగపూర్కు వెళ్లిన అనంతరం తన రాజీనామాను స్పీకర్కు పంపించారు. బసిల్ రాజపక్స కూడా పారిపోదామని ప్రయత్నించగా.. విమానాశ్రయంలో ప్రజలు అడ్డుకోవడంతో దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది, గొటబాయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Karnataka: కిక్ బాక్సింగ్లో విషాదం.. సింగిల్ పంచ్కు యువ బాక్సర్ మృతి
అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు. జులై 19న నామినేషన్లు స్వీకరించనున్నామని స్పీకర్ వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. జులై 20 ఎన్నిక జరగనుందని తెలిపింది.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..