Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahinda Rajapaksa: మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది. మే 9, 2022న కొలంబోలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన ఘోరమైన దాడిలో వారి ప్రమేయంపై దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రాజపక్సే, ఇతరులపై నిషేధం విధించబడింది.
మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్సు కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించాలని రాష్ట్రపతి తరపు న్యాయవాది శవేంద్ర ఫెర్నాండో కోర్టును కోరారు. వాదన విన్న తర్వాత, మేజిస్ట్రేట్ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో నాలుగో అనుమానితుడైన ఎంపీ మిలన్ జయతిలక్ సహా మరో ఇద్దరిపై విధించిన ప్రయాణ నిషేధాన్ని తదుపరి కోర్టు తేదీకి పొడిగించారు. ముందుగా బెయిల్పై విడుదలైన హేవాగమాగే మంజుల, రమేష్ భానుక, చమత్ తివాంక, నిశాంత డి మెల్లను కేసు నుంచి విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆగస్టు 11 వరకు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
Read Also: Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
అనేక మంది శ్రీలంక వాసులు ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నందున, మార్చి 2022లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రదర్శనల కారణంగా అప్పటి ప్రధాని మహింద రాజపక్స మే 9న రాజీనామా చేయగా, అతని సోదరుడు గొటబాయ రాజపక్స జులై 13న దేశం విడిచి పారిపోయి మరుసటి రోజు రాజీనామా చేశారు. విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. రాజపక్సేల రాజకీయ పార్టీ శ్రీలంక పొదుజన పెరమున మద్దతుతో జూలై 20న పార్లమెంటు అతన్ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!