Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahinda Rajapaksa: మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది. మే 9, 2022న కొలంబోలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన ఘోరమైన దాడిలో వారి ప్రమేయంపై దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రాజపక్సే, ఇతరులపై నిషేధం విధించబడింది.
మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్సు కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించాలని రాష్ట్రపతి తరపు న్యాయవాది శవేంద్ర ఫెర్నాండో కోర్టును కోరారు. వాదన విన్న తర్వాత, మేజిస్ట్రేట్ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో నాలుగో అనుమానితుడైన ఎంపీ మిలన్ జయతిలక్ సహా మరో ఇద్దరిపై విధించిన ప్రయాణ నిషేధాన్ని తదుపరి కోర్టు తేదీకి పొడిగించారు. ముందుగా బెయిల్పై విడుదలైన హేవాగమాగే మంజుల, రమేష్ భానుక, చమత్ తివాంక, నిశాంత డి మెల్లను కేసు నుంచి విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆగస్టు 11 వరకు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also: Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
అనేక మంది శ్రీలంక వాసులు ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నందున, మార్చి 2022లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రదర్శనల కారణంగా అప్పటి ప్రధాని మహింద రాజపక్స మే 9న రాజీనామా చేయగా, అతని సోదరుడు గొటబాయ రాజపక్స జులై 13న దేశం విడిచి పారిపోయి మరుసటి రోజు రాజీనామా చేశారు. విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. రాజపక్సేల రాజకీయ పార్టీ శ్రీలంక పొదుజన పెరమున మద్దతుతో జూలై 20న పార్లమెంటు అతన్ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!