Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahinda Rajapaksa: మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది. మే 9, 2022న కొలంబోలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన ఘోరమైన దాడిలో వారి ప్రమేయంపై దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రాజపక్సే, ఇతరులపై నిషేధం విధించబడింది.
మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్సు కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించాలని రాష్ట్రపతి తరపు న్యాయవాది శవేంద్ర ఫెర్నాండో కోర్టును కోరారు. వాదన విన్న తర్వాత, మేజిస్ట్రేట్ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో నాలుగో అనుమానితుడైన ఎంపీ మిలన్ జయతిలక్ సహా మరో ఇద్దరిపై విధించిన ప్రయాణ నిషేధాన్ని తదుపరి కోర్టు తేదీకి పొడిగించారు. ముందుగా బెయిల్పై విడుదలైన హేవాగమాగే మంజుల, రమేష్ భానుక, చమత్ తివాంక, నిశాంత డి మెల్లను కేసు నుంచి విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆగస్టు 11 వరకు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
Read Also: Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
అనేక మంది శ్రీలంక వాసులు ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నందున, మార్చి 2022లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రదర్శనల కారణంగా అప్పటి ప్రధాని మహింద రాజపక్స మే 9న రాజీనామా చేయగా, అతని సోదరుడు గొటబాయ రాజపక్స జులై 13న దేశం విడిచి పారిపోయి మరుసటి రోజు రాజీనామా చేశారు. విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. రాజపక్సేల రాజకీయ పార్టీ శ్రీలంక పొదుజన పెరమున మద్దతుతో జూలై 20న పార్లమెంటు అతన్ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!