Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahinda Rajapaksa: మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది. మే 9, 2022న కొలంబోలో శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన ఘోరమైన దాడిలో వారి ప్రమేయంపై దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రాజపక్సే, ఇతరులపై నిషేధం విధించబడింది.
మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్సు కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించాలని రాష్ట్రపతి తరపు న్యాయవాది శవేంద్ర ఫెర్నాండో కోర్టును కోరారు. వాదన విన్న తర్వాత, మేజిస్ట్రేట్ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో నాలుగో అనుమానితుడైన ఎంపీ మిలన్ జయతిలక్ సహా మరో ఇద్దరిపై విధించిన ప్రయాణ నిషేధాన్ని తదుపరి కోర్టు తేదీకి పొడిగించారు. ముందుగా బెయిల్పై విడుదలైన హేవాగమాగే మంజుల, రమేష్ భానుక, చమత్ తివాంక, నిశాంత డి మెల్లను కేసు నుంచి విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆగస్టు 11 వరకు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also: Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
అనేక మంది శ్రీలంక వాసులు ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నందున, మార్చి 2022లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రదర్శనల కారణంగా అప్పటి ప్రధాని మహింద రాజపక్స మే 9న రాజీనామా చేయగా, అతని సోదరుడు గొటబాయ రాజపక్స జులై 13న దేశం విడిచి పారిపోయి మరుసటి రోజు రాజీనామా చేశారు. విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. రాజపక్సేల రాజకీయ పార్టీ శ్రీలంక పొదుజన పెరమున మద్దతుతో జూలై 20న పార్లమెంటు అతన్ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!