Srilanka Economic Crisis: రాజపక్స పరార్.. ఎక్కడికో తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. రాజపక్స పారిపోయేందుకు అక్కడి మిలిటరీ సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం రాజీనామా చేస్తానని వెల్లడించి రాజపక్స, ప్రజల తిరుగుబాటుతో పరారయ్యారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం నుంచి శ్రీలంకలో మళ్లీ భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. దీంతో పరిస్థితిని గమనించిన రాజపక్స కొలంబోలోని తన అధ్యక్ష అధికారిక నివాసం నుంచి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ భారీ సూటికేసులతో దేశం దాటినట్లు వార్తలు వచ్చాయి. భారీగా ప్రెసిడెంట్ నివాసానికి వచ్చిన ప్రజలు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాజపక్స రాజీనామా చేసేదాకా అధ్యక్ష భవనం నుంచి కదిలేది లేదంటూ అక్కడే మకాం వేశారు.
ఇదిలా ఉంటే గొటబాయ రాజపక్స బుధవారం దేశం వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. రాజపక్స శ్రీలంకను వదిలిపెట్టి పక్కనే ఉన్న మరో ద్వీపదేశం మాల్దీవులకు పరారయ్యారు. గొటబాయ రాజపక్స, ఆయన భార్య ఆంటోనోవ్ – 32 విమానంలో మాల్దీవులకు వెళ్లారని తెలుస్తోంది. మొత్తం 15మంది కుటుంబ సభ్యులతో దేశం రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. రాజపక్స సోదరులు మొత్తం నలుగురు అందరికన్నా పెద్దవాడు చమల్ రాజపక్స. ఆ తరువాత వారిలో మహిందా రాజపక్స, గొటబాయ రాజపక్స, బాసిల్ రాజపక్స ఉన్నారు. ప్రస్తుతం గొటబాయ రాజపక్స కొడుకు నికల్ తో సహా దేశం వదిలినట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రధాన విమానాశ్రయం నుంచే రాజపక్స పరారైనట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. దేశం విడిచి వెళ్లేందుకు రాజపక్స చేసిన ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. జూలై 13న రాజీనామా చేసే లోపే దేశం వదిలి పారిపోవాలని అధ్యక్షుడు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అధ్యక్ష పదవిలో ఉంటే రాజపక్స అరెస్ట్ నుంచి మినహాయించబడతాడు.
Also Read
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
Read Also: Saudi Arabia: సౌదీ యువరాజు ఓ సైకో.. పలు దేశాలకు ముప్పులా పరిణమించాడు!
అయితే గత శనివారం గొటబాయ శ్రీలంక నేవీ షిప్ గజబాహులో దేశం వదిలిపారిపోయినట్లు వార్తలు వచ్చాయి. యూఏఈకి పారిపోవాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాల్దీవులు పారిపోయినట్లు దాదాపుగా కన్ఫార్మ్ అయింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడ ప్రజలు గొటబాయ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని గత మార్చి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు గొటబాయతో పాటు ప్రధాని మహిందా రాజపక్సతో పాటు రాజపక్స కుటుంబీకుల అవినీతి వల్లే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!