Maharashtra: మహారాష్ట్ర సంక్షీర్ణంలో లుకలుకలు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం రాబోతోందా..? అంటే శివసేన( ఉద్ధవ్) పార్టీ మౌత్ పీస్ పత్రిక అయిన ‘సామ్నా’ ఔననే అంటోంది. ఉద్దవ్ వర్గానికి మద్దతుగా సామ్నా పత్రిక కొన్ని కీలక విషయాలను పేర్కొంది. ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని, ఏక్ నాథ్ షిండే శివసేనను వీడాలని అనుకుంటున్నారని సామ్నా తన కథనంలో పేర్కొంది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే వర్గంలోని కొంత మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు.
Read Also: Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
- Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
ప్రస్తుతం షిండే క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, అందుకే వారంతా ఆ వర్గం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారని సామ్నా పేర్కొంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన సీనియర్ శివసేన లీడర్ గజానన్ కీర్తికర్ బీజేపీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. బీజేపీ-శివసేన కూటమిలో అన్నీ సరిగా లేవని, బీజేపీ వివక్ష చూపిస్తోందని కీర్తికర్ ఆరోపించారు. 13 మంది ఏంపీలము ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్నామని, మా నియోజవర్గాల్లో సమస్యలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేని ఆయన అన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధం అవుతుందని కీర్తీకర్ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే బీజేపీ మాత్రం షిండే వర్గానికి 5-7 సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేదని సామ్నా నివేదించింది.
గతేడాది శివసేనలో అసమ్మతి రగిలింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగబాటు చేశారు. దీంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బీజేపీ – శివసేన కూటమి అధికారంలో వచ్చింది.
తాజావార్తలు
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?