Maharashtra: మహారాష్ట్ర సంక్షీర్ణంలో లుకలుకలు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం రాబోతోందా..? అంటే శివసేన( ఉద్ధవ్) పార్టీ మౌత్ పీస్ పత్రిక అయిన ‘సామ్నా’ ఔననే అంటోంది. ఉద్దవ్ వర్గానికి మద్దతుగా సామ్నా పత్రిక కొన్ని కీలక విషయాలను పేర్కొంది. ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని, ఏక్ నాథ్ షిండే శివసేనను వీడాలని అనుకుంటున్నారని సామ్నా తన కథనంలో పేర్కొంది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే వర్గంలోని కొంత మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు.
Read Also: Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..
Also Read
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
- ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ప్రస్తుతం షిండే క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, అందుకే వారంతా ఆ వర్గం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారని సామ్నా పేర్కొంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన సీనియర్ శివసేన లీడర్ గజానన్ కీర్తికర్ బీజేపీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. బీజేపీ-శివసేన కూటమిలో అన్నీ సరిగా లేవని, బీజేపీ వివక్ష చూపిస్తోందని కీర్తికర్ ఆరోపించారు. 13 మంది ఏంపీలము ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్నామని, మా నియోజవర్గాల్లో సమస్యలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేని ఆయన అన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధం అవుతుందని కీర్తీకర్ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే బీజేపీ మాత్రం షిండే వర్గానికి 5-7 సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేదని సామ్నా నివేదించింది.
గతేడాది శివసేనలో అసమ్మతి రగిలింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగబాటు చేశారు. దీంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బీజేపీ – శివసేన కూటమి అధికారంలో వచ్చింది.
తాజావార్తలు
-
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్తో భారీ హైప్
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!