Sharad Pawar: ప్రధాని రేసులో నేను లేను.. విపక్షాల ఐక్యతే ముఖ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు. దేశాభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. ఇటీవల మరణించిన పూణే యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామ్ తకవాలే సంతాప సభలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పెద్ద విషయం కాదని అన్నారు.
Read Also: The Kerala Story: మతం మారాలని యువతిపై ఒత్తిడి.. “కేరళ స్టోరీ” చూసిన తర్వాత ఫిర్యాదు..
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
తాను ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని, నేను ప్రధాన మంత్రి రేసులో లేనని అన్నారు. మహా వికాస్ అఘాడిలో భాగమైన కాంగ్రెస్ మరియు శివసేన (యుబిటి)తో సీట్ల పంపకంపై పవార్ మాట్లాడుతూ.. ఇటీవల తన నివాసంలో సమావేశం జరిగిందని, ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ లేదంటే మల్లికార్జున ఖర్గే కలిసి సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల పదవీ కాలం 2022తో ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎన్నికలు జరగలేదు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు, ఆ తరువాత మహారాష్ట్ర ఎన్నికలు వరసగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!