Water Crisis: గుక్కెడు నీటి కోసం జనం తిప్పలు.. ప్రాణాలకు తెగిస్తున్న మహారాష్ట్రవాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాసిక్లోని కోశింపాడ గ్రామ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసితులు తమ బిందేలు నింపడానికి బావిలోకి దిగుతున్నారు. నీటి ఎద్దడి గ్రామ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎండిపోతున్నట్లు కనిపించే ఈ భారీ బావి నుండి నీటిని తీసుకురావడానికి గ్రామస్థులు ప్రతిరోజూ గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ వీడియోను న్యూస్ ఏజెన్సీ ANI షేర్ చేసింది.
Also Read : Avinash Reddy: నేడు విచారణకు అవినాష్రెడ్డి బెయిల్ పిటిషన్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
మహిళలు తాడు సాయంతో బావిలో దిగడం.. ప్లాస్టిక్ బిందేలు, టంబ్లర్లను ఉపయోగించి మురికి నీటిని సేకరిస్తున్నారు. బావి పైకి జాగ్రత్తగా స్కేలింగ్ చేసిన తర్వాత, దాని గట్లను మద్దతుగా ఉపయోగించడం ద్వారా, మహిళలు మురికి నీటిని ఫిల్టర్ చేసి మట్టి కుండల్లో నింపుకుంటున్నారు. కరువు, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన మరియు తీవ్రమైన వర్షపాతం లేకపోవడం వంటి అంశాల కలయిక వల్ల నీటి సంక్షోభం ఏర్పడింది. వర్షాభావం వల్ల బావుల్లో నీటి మట్టం పడిపోవడం, వర్షాలు కురవకపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బందిగా మారింది. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం కూడా సమస్యకు కారణమైంది.
Also Read : Mahesh Babu: చిన్న సినిమాకి పెద్ద సపోర్ట్… ఒక్క ట్వీట్ తో జాతకం మార్చేశాడు
గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నీటి కనెక్షన్ ఉండేలా టెండర్ పాస్ చేశామని మహారాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్కుమార్ కృష్ణారావు గవిట్ తెలిపారు. 2024 వరకు ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద నీటి సౌకర్యం ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం టెండర్ ఆమోదించబడింది, ”అని మినిస్టర్ గవిట్ చెప్పారు. మహారాష్ట్రలో నీటి సంక్షోభం ముఖ్యంగా నాసిక్లోని మారుమూల కొండ గ్రామాలను తాకింది. నాసిక్తో పాటు రాయ్గఢ్, ఔరంగాబాద్ జిల్లాల్లో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
#WATCH | Maharashtra: Due to the water crisis, people of Koshimpada Village are compelled to consume; descent into a well to fetch water pic.twitter.com/6orDLsCpyQ
— ANI (@ANI) May 24, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!