Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అనేది పక్కపెట్టి ఈగోలకు పోతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. థానే జిల్లాలో భార్య గర్భం దాల్చడం లేదని భార్య ఆమెను అతి కిరాతకం చంపేశాడు. పిల్లలు కనే విషయంలోనే ఇద్దరూ తరచూ గొడవలు పడే వారని సమాచారం. ఈ విషయంలో వారి మధ్య గొడవ పెద్దదై ఓ వ్యక్తి తన 35 ఏళ్ల భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Delhi Incident: ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను 21 సార్లు కత్తితో పొడిచి హత్య..
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
వివరాల్లోకి వెళితే.. అంబర్నాథ్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో వీరిద్దరు నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగడంతో 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉల్హాస్నగర్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మహిళ గర్భం దాల్చకపోవడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని అధికారి తెలిపారు. ఆదివారం మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో నిందితుడు భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
Read Also:Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్
దాడి తర్వాత మహిళ కుప్పకూలి స్పాట్లోనే చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలియడంతో ఫ్యాక్టరీలోని వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పోలీసులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకుని వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసు ఇన్స్పెక్టర్ జెబి సోనావానే మీడియాకు తెలిపారు. ఆ వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేసి అతనిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!