Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రైన్ లో నిప్పంటించి ముగ్గురు మరణాలకు కారణం అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు షారుఖ్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి పట్టుకున్నారు. మహరాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
దేశంలో కరోనా మరోసారి పగడ విప్పింది. రోజువారీ కేసులు వందల సంఖ్య నుంచి వేలకు చేరింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. మహారాష్ట్రలో ఈ రోజు 711 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Carona : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 562 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు.
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భవిష్యత్ లో సీఎంగా చూడాలని మహారాష్టలోని పుణెకు చెందిన ఓ ఐస్ క్రీం వ్యాపారి ఆశ పడుతున్నాడు. అంతేకాకుండా సచిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు.
వేడివేడిగా ఉన్న పెనంపై కూర్చుని భక్తులను బాబా ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంత్ గురుదాస్ మహరాజ్గా గుర్తించబడిన ఈ బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గోసంరక్షణ సంస్థలను నడుపుతున్నాడు.