బాలల సంక్షేమ కమిటీ టోల్ఫ్రీ నంబర్కు ఆ అమ్మాయిలు కాల్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ కమిటీ సభ్యులు మంగళవారం అకోలాలోని స్కూల్ కు వచ్చి, వారితో మాట్లాడాగా.. దాని తర్వాత వేధింపుల అభియోగాల కింద సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.
Road Rage Video: మహారాష్ట్ర థానే జిల్లా అంబర్నాథ్ లో రోడ్డు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఇందులో టాటా సఫారీ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా మరో కారును ఢీకొట్టాడు. దీని తరువాత, ఒక వ్యక్తి వాహనంలో ఇరుక్కుపోవడంతో అతన్ని చాలా సేపు బయటికి లాగడం కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారు రైడర్ తన కారుతో ఐదుగురిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,…
Huge Fire Accident: మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రి చించ్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో సదరు ప్రాంతంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే…
కోల్కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ముంబైలోని థానేలో ఇద్దరు బాలికలను వేధించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోల్కతాలాగే ఇప్పుడు ముంబైలోనూ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని బద్లాపూర్లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై ఓ స్వీపర్ ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పెను దుమారం చెలరేగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ…
Murder Attack: తల్లికి తన బిడ్డల కంటే ఏదీ ముఖ్యం కాదు. పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతి ఆపదను ఎదుర్కొనే ధైర్యం తల్లికి ఉంటుంది. మహారాష్ట్రలో పట్టపగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ సమయంలో అతని తల్లి ధైర్యంగా త్వరగా స్పందించి తన కొడుకు ప్రాణాలను కాపాడింది. కొల్హాపూర్ లోని జైసింగ్ పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ షాకింగ్…
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు జరిగి,
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్లోని జైసింగ్పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 80 మంది విద్యార్థులు పోషకాహార కార్యక్రమం కింద బిస్కెట్లు తిని ఆసుపత్రిలో చేరారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులకు వికారం, వాంతులు వచ్చాయి.