Maharashtra: కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం.. గతేడాది మోడీ ఆవిష్కరణ
- కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం
- గతేడాది ఆవిష్కరించి ప్రధాని మోడీ
- మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని ఓ కోటలో ఘటన
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని ఓ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం కుప్పకూలింది. దీన్ని గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రస్తుతం విగ్రహం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటనేది నిర్ధారణ కాలేదు. అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ప్రతిపక్షాలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శించాయి. పనుల నాణ్యతపై తక్కువ శ్రద్ధ చూపిందని ఆరోపించాయి.
READ MORE: Husband Kills Wife: డంబుల్స్తో భార్యను కొట్టి చంపిన భర్త.. కారణమిదే..?
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
పీటీఐ ప్రకారం… 35 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మధ్యాహ్నం 1 గంటలకు మాల్వాన్లోని రాజ్కోట్ కోటలో పడిపోయిందని ఓ అధికారి తెలిపారు. దీనికి గల కారణాన్ని నిపుణులు కనుగొంటున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది కూడా ఓ కారణం కావచ్చని అధికారుల అభిప్రాయం. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నష్టంపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
READ MORE: Janmashtami 2024: కోపం మనిషిని ఎలా దిగజారుస్తుంది?.. భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పనుల నాణ్యతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కమీషన్ల కోసం ప్రభుత్వం కొత్త టెండర్లను మాత్రమే జారీ చేస్తుంది.” అని ఆరోపించారు. శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే వైభవ్ నాయక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిలో నాణ్యత లేనిదని విమర్శించారు. “రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు. విగ్రహం నిర్మాణం, ప్రతిష్టాపనకు బాధ్యులైన వారిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?