Eknath Shinde: ఫడ్నవీస్ అరెస్ట్కి కుట్ర చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సీఎం సంచలన ఆరోపణ..
- ఫడ్నవీస్ అరెస్ట్కి అప్పటి ఎంవీఏ ప్రభుత్వం కుట్ర..
- బీజేపీని అణిచేందుకు ఉద్ధవ్ సర్కార్ ప్లాన్..
- సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఏక్నాథ్ షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Read Also: Jaganmatha Stotram: శ్రావణ మంగళవారం జగన్మాత స్తోత్రాలు వింటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘ వారు ప్రతీది ప్లాన్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ని అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. ఇది బీజేపీని వెనుకడుగు వేసేలా చేయొచ్చు. వారి ఎమ్మెల్యేలు ఎంవీఏలో చేరొచ్చు’’ అని షిండే అన్నారు. తనకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఈ కుట్రతో ఎంవీఏ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకుందని చెప్పారు. బీజేపీపై ప్రతీకారానికి వారు ఈ మార్గాన్ని సమర్థించారని చెప్పారు.
అర్బన్ ల్యాండ్ కేసులో నన్ను కూడా ఇరికించాలని ప్రయత్నించారని, కొంత మంది అధికారుల నుంచి ఈ విషయం గురించి తెలిసిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్లాన్ గురించి మొత్తం తెలుసుకున్నానని అన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ వ్యవహారాల్లో తన కుటుంబ సభ్యుల అనవసర జోక్యాన్ని అనుమతించారని షిండే విమర్శించారు. దీని వల్ల ఠాక్రే ప్రవర్తన మరింత అస్థిరంగా మారిందని, అతనికి అయోమయం, విచారం కలిగిందని అన్నారు. పార్టీ పట్ల అంకిత భావం ఉన్నప్పటికీ రాజ్ ఠాక్రేని అన్యాయంగా పక్కన పెట్టేశారని, ఇది బాలా సాహెబ్ ఠాక్రే కోరికకు విరుద్ధంగా ఉందని షిండే చెప్పారు. బాలా సాహెబ్ ఠాక్రే రాజ్ ఠాక్రేని విడిచిపెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!