Eknath Shinde: ఫడ్నవీస్ అరెస్ట్కి కుట్ర చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సీఎం సంచలన ఆరోపణ..
- ఫడ్నవీస్ అరెస్ట్కి అప్పటి ఎంవీఏ ప్రభుత్వం కుట్ర..
- బీజేపీని అణిచేందుకు ఉద్ధవ్ సర్కార్ ప్లాన్..
- సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఏక్నాథ్ షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Read Also: Jaganmatha Stotram: శ్రావణ మంగళవారం జగన్మాత స్తోత్రాలు వింటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు
Also Read
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘ వారు ప్రతీది ప్లాన్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ని అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. ఇది బీజేపీని వెనుకడుగు వేసేలా చేయొచ్చు. వారి ఎమ్మెల్యేలు ఎంవీఏలో చేరొచ్చు’’ అని షిండే అన్నారు. తనకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఈ కుట్రతో ఎంవీఏ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకుందని చెప్పారు. బీజేపీపై ప్రతీకారానికి వారు ఈ మార్గాన్ని సమర్థించారని చెప్పారు.
అర్బన్ ల్యాండ్ కేసులో నన్ను కూడా ఇరికించాలని ప్రయత్నించారని, కొంత మంది అధికారుల నుంచి ఈ విషయం గురించి తెలిసిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్లాన్ గురించి మొత్తం తెలుసుకున్నానని అన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ వ్యవహారాల్లో తన కుటుంబ సభ్యుల అనవసర జోక్యాన్ని అనుమతించారని షిండే విమర్శించారు. దీని వల్ల ఠాక్రే ప్రవర్తన మరింత అస్థిరంగా మారిందని, అతనికి అయోమయం, విచారం కలిగిందని అన్నారు. పార్టీ పట్ల అంకిత భావం ఉన్నప్పటికీ రాజ్ ఠాక్రేని అన్యాయంగా పక్కన పెట్టేశారని, ఇది బాలా సాహెబ్ ఠాక్రే కోరికకు విరుద్ధంగా ఉందని షిండే చెప్పారు. బాలా సాహెబ్ ఠాక్రే రాజ్ ఠాక్రేని విడిచిపెట్టాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..