Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలో బీజేపీదే పైచేయి.. తాజా సర్వేలో వెల్లడి..
- ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..
- మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ..
- హర్యానాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
- జార్ఖండ్లో కమలమే..
- తాజా సర్వే ఫలితాల్లో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు జరిగి, ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఈ ఎన్నికలు వస్తుండటంతో అందరి దృష్టి వీటిపై ఉంది. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిలో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారనే విషయం స్పష్టంగా తేలబోతోంది.
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికలకు సంబంధించి మాట్రిజ్ సర్వే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా ప్రజలు మూడ్ ఎలా ఉందనే వివరాలను వెల్లడించింది.
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ:
4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘మహాయుతి’ కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)- శివసేన(ఉద్ధవ్)ల ‘మహా వికాస్ అఘాడీ’ కూటముల మధ్య పోరు నెలకొంది. ఈ పోరులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మెరుగైన ఫలితాలను సాధిస్తుందని సర్వే వెల్లడించింది.
ఓట్ షేర్ ప్రకారం.. బీజేపీకి 25.8 శాతం, 18.6 శాతం కాంగ్రెస్కి, ఠాక్రే శివసేనకి 14.2, షిండే శివసేనకు 14.2 శాతం, రెండు ఎన్సీపీ విభాగాలకు 10 శాతం ఓట్లు రానున్నట్లు వెల్లడించింది. ఇతరులకు 12.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
సీట్ల పరంగా చూస్తే మరోసారి సింగిల్ లార్జెట్ పార్టీగా బీజేపీ అవతరించబోతోంది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి 95-105 సీట్లు, శివసేన(షిండే)కి 19-24 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 7-12 సీట్లు వస్తాయని చెప్పింది.
ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్కి 42-47 సీట్లు, శివసేన ఠాక్రేకి 26-31 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్కి 23-28 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 11-16 సీట్లు రావచ్చని చెప్పింది.
హర్యానాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్:
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 01న ఎన్నికలు జరగబోతున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాట్రిజ్ సర్వే ప్రకారం.. ఈ రాష్ట్రంలో బీజేపీకి 37-42 సీట్లు, కాంగ్రెస్కి 33-38 సీట్లు, జేజేపీకి 3-8 సీట్లు, ఇతరులకు 7-12 సీట్లు వస్తాయని అంచనా. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 35.2 శాతం, కాంగ్రెస్కి 31.6 శాతం, జేజేపీకి 12.4 శాతం, ఇతరులకు 20.8 శాతం వస్తాయని అంచానా
జార్ఖండ్లో కమలమే:
జార్ఖండ్లో మొత్తం 82 అసెంబ్లీ సీట్లు ఉంటే, 81 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సర్వే ప్రకారం.. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నట్లు అంచనా. బీజేపీకి 38-43 స్థానాలు, జేఎంఎంకి 19-24 సీట్లు, కాంగ్రెస్కి 7-12 సీట్లు, ఏజేఎస్యూపీకి 02-07 స్థానాలు వస్తాయని, ఇతరులు 03-08 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 41.2 శాతం, జేఎంఎంకి 18.2 శాతం, కాంగ్రెస్కి 12.2 శాతం, ఏజెఎస్యూపీకి 9.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!