Badlapur: బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ స్వీపర్..పెద్దఎత్తున నిరసనలు..రైలు రోకో
- దేశ వ్యాప్తంగా దుమారం రేపిన కోల్ కతా ఘటన
- తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన
- నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై స్వీపర్ అఘాయిత్యం
- పెద్ద ఎత్తున నిరసనలు
- రైల్వే ట్రాక్ దిగ్భందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ముంబైలోని థానేలో ఇద్దరు బాలికలను వేధించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోల్కతాలాగే ఇప్పుడు ముంబైలోనూ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని బద్లాపూర్లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై ఓ స్వీపర్ ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పెను దుమారం చెలరేగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. నిరసన కారులు పాఠశాలను ధ్వంసం చేసి రైల్వే ట్రాక్ను దిగ్బంధించారు. ఆ తర్వాత పోలీసులు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Guwahati video: సిక్కింలో ప్రమాదం.. పవర్ స్టేషన్పై పడ్డ కొండచరియలు
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
నిరసనల కారుల సంఖ్య పెరిగింది. ఆగ్రహించిన ప్రజల పెద్ద ఎత్తున నగరంలో బ్యానర్లు, పోస్టర్లతో బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా ఒక్కసారిగా నిరసన కారులు రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించారు. రైలు ట్రాక్ లను నిర్భంధించారు. ఈ సమయంలో పోలీసులు జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో జనం రాళ్లు రువ్వారు. ట్రాక్లపై ధర్నాలు చేయడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్పై గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. నిరసన కారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపైకి ప్రజలు రాళ్లు రువ్వారు. ఈ వేధింపుల సమస్య ఊపందుకోవడం ప్రారంభించింది.
READ MORE:CM Chandrababu: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
దోషులను వదిలిపెట్టం:
బద్లాపూర్ ఘటనపై సీఎం.. ఈ విషయాన్ని తాను సీరియస్గా తీసుకున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేసి ఘటన జరిగిన స్కూల్పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలినా ఎవరినీ విడిచిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సిట్కు ఐజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఆర్తీ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందం బద్లాపూర్ కేసును విచారించనుంది. దీంతో పాటు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రతిపాదన ఇవ్వాలని థానే పోలీస్ కమిషనర్ను కోరారు. తద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!