BJP: హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తిరస్కరించి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే, కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ ఓడిపోతే ఈవీఎంల గురించి ఏడుస్తారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీని ప్రభావం ఇప్పుడు భారత కూటమిపై కూడా కనిపిస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తన పాత్రను కోల్పోవడం ప్రారంభించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల తాజా డిమాండ్తో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. కూటమిలో కాంగ్రెస్ వెనక్కి తగ్గాలని, ప్రతిపక్ష కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని టీఎంసీ నుంచి నాలుగుసార్లు లోక్సభ ఎంపీగా…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. మహాయుతి కూటమి 235 మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 49 మాత్రమే సాధించింది. తాజాగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 288 సీట్లకు గాను 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మళ్లీ తానే సీఎం అవుతానని ఎక్నాథ్ షిండే ధీమా…
DK Shivakumar: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు.
Devendra Fadnavis: నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ బుధవారం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ని ఉద్దేశిస్తూ..
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత, ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. సోమవారం గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై జార్ఖండ్లోని అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శరద్పవార్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గడియారం గుర్తు తమకే కేటాయించాలంటూ శరద్పవార్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న (బుధవారం) జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. అయితే వారం మధ్యలో (బుధవారం) పోలింగ్ ఎందుకు పెట్టారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.