DK Shivakumar: ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే..
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ తారుమారు అవుతాయి..
- మహారాష్ట్రలో గెలుపు కాంగ్రెస్ పార్టీదే..
- కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
DK Shivakumar: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని తప్పని రుజువు అవుతుందని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కర్ణాటక రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర దేవాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన శివకుమార్.. తప్పకుండా గెలుస్తాం. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారవుతాయని అన్నారు. “నేను మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రచారం నిర్వహించాను. అక్కడ తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉంది. మహారాష్ట్రలో స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఆయన నేతలందరితో కూడా మాట్లాడారు, నేను కూడా మహారాష్ట్రకు వెళ్లాను. పార్టీకి అంతా అనుకూలంగా, సజావుగా సాగుతున్నట్లు నేను చూశాను’’ అని చెప్పారు.
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
Read Also: Pawan Kalyan Hugs Botsa:అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. పవన్ను ఆలింగనం చేసుకున్న బొత్స..
జార్ఖండ్ ఫలితాల గురించి అడిగిన సందర్భంలో.. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల గురించి తనకు తెలియదని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాటకలోని చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. గెలుస్తామని చెప్పారు. కుమార స్వామిపై వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన ‘‘కాలా’’ అనే వ్యాఖ్యలు దెబ్బతీస్తాయా..? అని ప్రశ్నించిన సమయంలో, ఆయన తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తప్పు అని చెప్పానని శివకుమార్ అన్నారు.
తాజావార్తలు
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో