Assembly Polls: మహారాష్ట్ర, జార్ఖండ్లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!
- మహారాష్ట్ర.. జార్ఖండ్లో పోటెత్తిన ఓటర్లు
- మహారాష్ట్రలో 58.22%.. జార్ఖండ్లో 67.59 %
- రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏకే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. అలాగే సల్మాన్ఖాన్, షారూఖ్ఖాన్తో సహా పలువురు నటులు ఓటు వేశారు.
మహారాష్ట్రలో దాదాపు 58.22 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. చివరి రెండు గంటల్లో ఓటర్లు పోటెత్తారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం మాత్రం కొంచెం మందకొడిగా సాగింది. సాయంత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. ఇక జార్ఖండ్లో జరిగిన రెండో విడత పోలింగ్లో భారీగానే ఓటింగ్ శాతం నమోదైంది. దాదాపు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా వార్తలు అందుతున్నాయి.
Also Read
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో బుధవారం పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడత నవంబర్ 13న 43 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సెకండ్ విడత బుధవారం 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో జార్ఖండ్ ఓటర్లు పోలింగ్ బూత్లకు పోటెత్తారు. భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదలకానున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమినే హవా నడుస్తోంది. మహారాష్ట్రలో తిరిగి మహాయుతి కూటమి విజయం సాధిస్తోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగే జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమినే జయకేతనం ఎగురవేయబోతుంది. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ డిబేట్ల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
Till 5pm, Jharkhand (phase-II) and Maharashtra recorded 67.59% and 58.22% voter turnout respectively, as per Election Commission of India. pic.twitter.com/0dTCU5Tjvs
— ANI (@ANI) November 20, 2024
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!