Lord Hanuman: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. మధ్యప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి, ధార్ జిల్లా గంద్వానీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమర్ సింఘార్.. ‘హనుమంతుడు ఆదివాసీ’ అని అన్నారు. ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లో మూడు రోజుల తర్వాత 300 అడుగుల బోరుబావిలోంచి బయటకు తీసిన రెండేళ్ల బాలిక గురువారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాజధాని భోపాల్కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని సెహోర్లో ఈ ఘటన జరిగింది.
తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు పరిష్కారం కావడం లేదు. ఇరువురితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Hijab Controversy: రెండు రోజుల క్రితం హిజాబ్ వివాదం చెలరేగిన మధ్యప్రదేశ్లోని దామోహ్లోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ రిజిస్ట్రేషన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది.
ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత్కు తీసుకొచ్చిన ఆఫ్రికన్ చిరుతలు ఎందుకు చనిపోతున్నాయి..? కునో నేషనల్ పార్క్లో చీతాల వరుస మరణాలకు అసలు కారణం ఏంటి..? ఆఫ్రికా, భారత్ మధ్య వాతావరణంలో ఉన్న తేడా వల్లే చీతాలు చనిపోతున్నాయా.. లేక వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా..?
Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
BJP vs Congress: మధ్యప్రదేశ్ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. అయితే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మళ్లీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Apache Helicopter: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ఈరోజు మధ్యప్రదేశ్లోని బింద్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరాల్లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్పూర్లోని 13 ప్రాం తాల్లో ఎన్ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్యూటీ…