Priyanka Gandhi: మిషన్ మధ్యప్రదేశ్ ప్రారంభం. ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ..!
Priyanka Gandhi: కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ జోరు మీదుంది. ఇవాళ మిషన్ మధ్యప్రదేశ్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జేపీ అగర్వాల్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖాతో కలిసి గ్వారిఘాట్లో నర్మదా నది ఒడ్డున ప్రియాంక పూజలు చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా.. బీజేపీని గద్దె దించేందుకు హస్తం పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. మత రాజకీయాలకు మధ్యప్రదేశ్ అడ్డాగా మారిందని.. మతకలహాలు సృష్టించి బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
Read Also : Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అంతేకాకుండా రాష్ట్రంలో గత మూడేళ్లుగా బీజేపీ ఏం చేసిందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఎవరొక్కరి జీవితమైనా బాగుపడిందా అంటూ.. మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీకి చెంపపెట్టు అని అన్నారు. మరోవైపు 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. రెండేళ్ల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అంతేకాకుండా ఆయనతో పాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టుకుపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read Also : Civil Services: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల..
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పలు హిందూ సంఘాలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించాయి. మాజీ సీఎం కమల్నాథ్ సమక్షంలో భారీ సంఖ్యలో బజరంగ్ సేన కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. అయితే ప్రియాంక మధ్యప్రదేశ్ పర్యటనపై బీజేపీ నేతలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రియాంకకు పూజలు గుర్తుకు వస్తాయని.. హిమాచల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికి నెరవేర్చలేదని అక్కడి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!