Honour killing: ప్రేమిస్తోందని కూతురుని చంపేసిన తండ్రి.. లవర్ని కూడా వదిలిపెట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour killing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమిస్తుందని కన్న తండ్రి కూతుర్ని చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రియుడిని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మొరెనాలో జరిగింది. ఇద్దరు చనిపోయిన తర్వాత చంబల్ నదిలో ఇద్దరి మృతదేహాలను పారేశాడు. మొరేనా జిల్లా రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాణి(18), సమీప గ్రామం బలుపురాకు చెందిన రాధేశ్యామ్ తోమర్(21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శివాణి తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.
Read Also: PM Modi US Visit: మోడీ అమెరికా పర్యటనను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర.. టూల్ కిట్తో ఐఎస్ఐ ప్లాన్
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
నిందితుడు రాజ్ పాల్ విచారణలో తన కూతుర్ని, ఆమె ప్రేమికుడిని చంపేసినట్లు అంగీకరించాడు. మృతదేహాలను పడేసిన ప్రాంతాన్ని పోలీసులకు వెల్లడించాడు. జూన్ 3న శివాని అనే మహిళ తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అయితే ఆమె తండ్రి ఏమీ తెలియనట్లుగా.. అంబాహ్ పోలీస్ స్టేషన్లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శివాని ప్రేమికుడు ఛోటూ తోమర్ కూడా కనిపించకుండా పోవడంతో జూన్ 4న తోమర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో మే నెలలో వీరిద్దరు ఇళ్ల నుంచి పారిపోయారు. వీరిని ఉత్తర్ ప్రదేశ్ లో గుర్తించిన పోలీసులు తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సారి కూడా పారిపోవచ్చని తోమర్ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరి హత్య జరిగి ఉండొచ్చనే విశ్వసనీయ సమాచారం కూడా వచ్చింది. నిందితుడు రాజ్ పాల్ ని అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. మృతదేహాల కోసం చంబల్ నదిలో వెతుకున్నారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!