Madhya Pradesh: ఎన్నికల ముందు కాంగ్రెస్కి ఎదురుదెబ్బ.. కమల్నాథ్ ఇలాకాలో బీజేపీ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. కర్ణాటకలో గెలిచిన ఊపులో మధ్యప్రదేశ్ లో కూడా గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. గత నాలుగు పర్యాయాలుగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ మరోసారి గెలిచి 2024 లోక్ సభ ఎన్నికల ముందు తమ సత్తా చాటాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
Read Also: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. మాజీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత సొంత ప్రాంతంలో బీజేపీ ఘన విజయాన్ని దక్కించుకుంది. చింధ్వారా నియోజకవర్గంలోని లోకల్ బాడీకి జరిగిన బైపోల్ లో ఒక వార్డును బీజేపీ దక్కించుకోవడంతో పాటు మొత్తంగా 13 స్థానిక సంస్థలకు ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ మొత్తం ఏడుగురు కార్పొరేటర్లను గెలిపించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
చింధ్వారా మున్సిపల్ కార్పొరేషన్ లోని 42 వార్డుకు జరిగిన బైపోల్ లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. చింధ్వారా మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కంచుకోటగా ఉంది. ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి సందీప్ సింగ్ చౌహాన్ 436 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర స్వామిని ఓడించారు. ఈ గెలుపుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదల్ హర్షం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పెద్దపీట వేశారని అనన్ారు. కమల్ నాథ్, అతని కొడుకు ఎంపీ అయిన నకుల్ నాథ్ ఇద్దరూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోవడానికి ప్రచారం చేశారని.. అయినా బీజేపీ విజయం సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!