Madhya Pradesh: ఎన్నికల ముందు కాంగ్రెస్కి ఎదురుదెబ్బ.. కమల్నాథ్ ఇలాకాలో బీజేపీ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. కర్ణాటకలో గెలిచిన ఊపులో మధ్యప్రదేశ్ లో కూడా గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. గత నాలుగు పర్యాయాలుగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ మరోసారి గెలిచి 2024 లోక్ సభ ఎన్నికల ముందు తమ సత్తా చాటాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
Read Also: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. మాజీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత సొంత ప్రాంతంలో బీజేపీ ఘన విజయాన్ని దక్కించుకుంది. చింధ్వారా నియోజకవర్గంలోని లోకల్ బాడీకి జరిగిన బైపోల్ లో ఒక వార్డును బీజేపీ దక్కించుకోవడంతో పాటు మొత్తంగా 13 స్థానిక సంస్థలకు ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ మొత్తం ఏడుగురు కార్పొరేటర్లను గెలిపించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
చింధ్వారా మున్సిపల్ కార్పొరేషన్ లోని 42 వార్డుకు జరిగిన బైపోల్ లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. చింధ్వారా మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కంచుకోటగా ఉంది. ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి సందీప్ సింగ్ చౌహాన్ 436 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర స్వామిని ఓడించారు. ఈ గెలుపుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదల్ హర్షం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పెద్దపీట వేశారని అనన్ారు. కమల్ నాథ్, అతని కొడుకు ఎంపీ అయిన నకుల్ నాథ్ ఇద్దరూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోవడానికి ప్రచారం చేశారని.. అయినా బీజేపీ విజయం సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!