ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీ వర్గాలలో ఆనందాన్ని నింపాయి. దానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫలితాల అనంతరం పోస్ట్ చేసిన ట్విట్ ఉదాహరణ. ‘జాతీయ వాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు’ అని చెబుతూనే, ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించడంతో ఆ పార్టీకి ప్రకాశ్ రాజ్…
“మా” మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. ఇరు ప్యానళ్ల మధ్య హోరాహోరి జరిగిన పోటీలో ఎట్టకేలకు మంచు విష్ణు విజయపతాకం ఎగరేసి ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే విష్ణు ప్యానల్ భారీ మెజార్టీ ఓట్లతో గెలవడానికి ముఖ్యకారణం ప్రాంతీయవాదం అని చెప్పొచ్చు. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు లోకల్, నాన్ లోకల్ అనే ప్రాంతీయ…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి…
గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ఈరోజు ముగిశాయి. 83 శాతం ఓటింగ్ తో ఈసారి ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఉదయం నుంచి రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య గొడవలు, తోపులాటలు, వాదోపవాదాలు లాంటి సంఘటలు జరిగాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఘర్షణకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిందా ? అనే అనుమానం రాక మానదు ఎవరికైనా. ముఖ్యంగా మంచు విష్ణు,…
క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రణరంగాన్ని తలపించిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇంతకు మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి చాలామంది ‘మా’ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ‘మా’ సభ్యులు 925 మంది ఉండగా, రికార్డు స్థాయిలో అంటే పోస్టల్ బ్యాలెట్ తో కలిఫై మొత్తం 665 మంది సభ్యులు ఓటు వేశారు. దాదాపు 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 83 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గతంతో పోలిస్తే భారీగా…
ఉత్కంఠబరితంగా సాగుతోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్రాజ్, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ను పొడిగించారు.. ఇక, ఈ ఏడాదిలో మా ఎన్నికల పోలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది చివరి సమాచారం అందినప్పటి వరకు 665 మంది ఓటుహక్కు…
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Read also : మీడియాకి మంచి మెటీరియల్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించినట్టు ప్రకటించారు.. కాగా, ఇప్పటికే మా ఎన్నికల్లో పోలింగ్…
‘మా’ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్ వేయడం గమనార్హం. లోపల సిట్యుయేషన్ చూశారు. ఎలా ఉంది ? ‘మా’ ఎలక్షన్స్ ఎప్పుడూ లేనంతగా హైప్ క్రియేట్ చేశాయి. మొదటిసారి ప్రత్యేర్థులు విమర్శలు కురిపించుకుంటున్నారు. మీరేం అంటారు ?…
‘మా’ ఎన్నికలు ఉద్రిక్తతలు, తోపులాటలు, ఆరోపణలను మధ్య జరుగుతున్నాయి. సినీ స్టార్స్ ఒక్కొక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ 300లకు పైగా ఓట్లు నమోదు అయ్యాయి. మరో రెండున్నర గంటల్లో ఓటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రికి ఫలితాలు వెల్లడవ్వనున్నాయి. నేటితో ఈ ‘మా’ గొడవలకు, ఘర్షణలకు, ఆరోపణలకు, ప్రత్యారోపణలకు తెర పడనుంది. గెలిచినవారి ఇప్పటికే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు ? అనే…