Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్కి అమిత్ షా కౌంటర్..
- కేంద్ర, తమిళనాడు మధ్య ‘‘డీలిమిటేషన్’’ రగడ..
- ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని అమిత్ షా హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
అయితే, స్టాలిన్ వ్యాఖ్యల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. తమిళనాడు ఒక్క పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోదని షా అన్నారు. ‘‘పునర్విభజన తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో స్పష్టం చేశారు’’ అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి రూపొందించడం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి లోక్సభ స్థానాలు తగ్గవచ్చని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణకు కారణమైంది.
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
Read Also: Wasim Akram: ‘‘కోతులు కూడా అంత తినవు’’.. పాక్ ప్లేయర్లపై వసీం అక్రమ్ ఫైర్..
పార్లమెంట్లో తమిళనాడు ప్రాధాన్యత తగ్గుతుందని స్టాలిన్ అన్నారు. ఇది తమిళ నాడు హక్కులకు సంబంధించిన విషయమని, పార్టీలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన తమ రాష్ట్రానికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు.
ఇదెలా ఉంటే, మరోవైపు ‘‘త్రి భాషా విధానం’’పై కూడా డీఎంకే ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నాంటూ మండిపడుతోంది. అయితే, దీనిపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. డీఎంకే కార్యకర్తలు మోసుకెళ్లే కొన్ని పెయింట్ డబ్బాలు తప్పా, తమిళ ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు భాషల విధానంపై డీఎంకే వైఖరిని తిరస్కరించారని అన్నారు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!