అయ్యప్ప స్వాముల మాలధారణల నేపథ్యంలో శబరిమల వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొల్లం వరకు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 19-22 తేదీల మధ్య కాచిగూడ-కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 17న సికింద్రాబాద్-కొల్లం మధ్య, 19న కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141…
హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్నగర్లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను…
రైల్వేశాఖలో భారీగా పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-డిలో పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 23న పున:ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 9,328 పోస్టులకు ఈనెల 23 నుంచి దశలవారీగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోస్టులలో ట్రాక్మన్ విభాగంలో 4,753, పాయింట్స్మెన్లు 1,949, హాస్పిటల్ అటెండర్లు 37, మిగతా పోస్టుల ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. Read Also: వాట్సాప్ ద్వారా క్రిప్టో…
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read Also: ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్…
✍ తెలంగాణలో నేడు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్✍ ఢిల్లీ: నేడు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు… నేడు ప్రజల సందర్శనార్థం రావత్ దంపతుల భౌతిక కాయాలు.. ఉ.11 గంటల నుంచి ప్రజలు, ప్రముఖుల సందర్శనకు అనుమతి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి భౌతికకాయాల సందర్శనకు సైనికాధికారులకు అనుమతి✍ ఏపీలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు… పీపీపీ విధానంలో విశాఖ, అనంతపురంలో ఏర్పాటు.. నేడు…
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి సంగం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మంది వాగు ఉధృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వాగులో భారీ వరదలో పలువురు ప్రయాణికులు కొట్టుకుపోతుండగా.. ఏడుగురిని స్థానికులు…
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ గాయపడ్డ…
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బస్సు ఎక్కి ప్రయాణం చేశారు. గురువారం నాడు హైదరాబాద్ నగరంలోని సిటీ ఆర్డినరీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణించారు. తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తున్న బస్ డే సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సజ్జనార్ బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేవారు వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సులో…
మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. ఈ రోజు విడుదలైన ట్రైలర్ గురించి రివ్యూలు, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్చరణ్-ఎన్టీఆర్ నటన.. ఇలా పలు అంశాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా…
తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. జనవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు సిఫారసులపై గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ప్రకటించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి వేడుకలు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆయా తేదీలలో తిరుమల వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే…