తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బస్సు ఎక్కి ప్రయాణం చేశారు. గురువారం నాడు హైదరాబాద్ నగరంలోని సిటీ ఆర్డినరీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణించారు. తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తున్న బస్ డే సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సజ్జనార్ బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేవారు వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరారు.
Read Also: ఓటీటీలో ‘RRR’ మూవీ వచ్చేది ఎప్పుడంటే…?
ట్రాఫిక్ చిక్కులు, పెరిగిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలని సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది అందరూ కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని… ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్ తెలిపారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గురువారం బస్ డే నిర్వహించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.