Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
- పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు
- కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది
- కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సిం ఈ బిల్లును సభ ముందుంచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ సవరణల ద్వారా పేపర్ లీక్ల వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది.
10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా
ప్రతిపాదిత సవరణ బిల్లు ప్రకారం, ప్రశ్నపత్రాల లీక్కు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల పారదర్శకతను కాపాడడం, పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లులోని ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్కు నో చెప్పిన ధర్మాసనం.!
- 15 నెలల వ్యాలిడిటీతో Jio 'Freedom Pack'.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
- Parliament Session: పార్లమెంట్లో నేడు కీలక బిల్లులు.. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుపై చర్చ.!
అదే రోజు ఆమోదానికి ప్రయత్నం
సాధారణంగా ఒక బిల్లును ప్రవేశపెట్టిన రోజే చర్చించి ఆమోదించడం అరుదుగా జరుగుతుంది. అయితే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం పరిశీలించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.
పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
ఇదిలా ఉండగా, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కొనసాగిస్తోంది. జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన చర్యలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంట్లో హోరాహోరీ చర్చకు అవకాశం
ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగిస్తే, నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాల తొలి వారంలో ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలు, సభలో నిరసనల కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలుమార్లు అంతరాయం కలిగాయి. దీంతో తొలి వారం సమావేశాలు పెద్దగా సాగకుండానే ముగిశాయి.
పరీక్షల భద్రతపై కేంద్రం దృష్టి
దేశంలో పోటీ పరీక్షలపై విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడేందుకు పేపర్ లీక్లను అరికట్టడం అత్యంత అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నేరస్తులకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించేలా చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ సవరణ బిల్లుపై పార్లమెంట్లో జరిగే చర్చ, తుది నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యాసంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
Public Examinations Act Amendment Bill 2026: లోక్సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
-
Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
-
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్గా అనిల్ రావిపూడి!
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్కు నో చెప్పిన ధర్మాసనం.!
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!