హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం చంచల్గూడ జైలుకు చేరుకుని శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైలులో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శివ బాలకృష్ణకు 10 రోజుల రిమాండ్ విధించాలని…
Telangana Elections : తెలంగాణలో పోలింగ్ షురూ అయింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓట్లు వేయడమే మానేశారు.
Tula Uma: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల వ్యవహారం వేడెక్కుతోంది. పార్టీలోని ప్రముఖ నేతలు తమ మద్దతుదారులకు టిక్కెట్లు ఇచ్చారు. కొందరికి ఆశించిన ఫలితాలు రాగా, మరికొందరికి బీజేపీ హైకమాండ్ మొండిచేయి చూపింది.
ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దుమారం రేపిన సంగతి తెలిసిందే . తాజాగా భారత్ పై దాయాది దేశం పాక్ సంచలన ఆరోపణలు చేసింది. రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పాక్ మంత్రి ఒకరు అన్నారు. మస్తుంగ్ లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని…
నేషనల్ మెడికల్ కమిషన్(NMC) చట్టబద్ధమైన నిబంధనలు, కనీస ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వైద్య కళాశాలల విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. నిబంధనలు పాటించని సందర్భాల్లో ఒక్కో ఉల్లంఘనకు రూ. 1 కోటి చొప్పున జరిమానా విధించనున్నట్లు జాతీయ వైద్య మండలి తెలిపింది. ఇవేకాక వైద్య సంస్థలు ఏడాది చివరిలో సమర్పించే రికార్డ్స్, మూల్యాంకన విధానాలు, నిబంధనలకు సంబంధించి ప్రొఫెసర్స్, డీన్, డైరెక్టర్, ఫ్యాకల్టీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ వైద్య సంస్థలకు రూ.5 లక్షల…
కాపాడాల్సిన పోలీసులే తనిఖీల పేరిట మహిళలపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలపై అత్యాచారం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ బాధితులకు 31 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఒకేసారి 215 మందికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇది 1992 నాటి ఘటన. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్ కొండప్రాంతంలో…
నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి…