Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Murder: బయటకు చూస్తే తాళం వేసి ఉన్న ఒక మామూలు అద్దె ఇల్లు, లోపల మాత్రం ఐదు రోజులుగా బయటకు రాని దారుణం. చివరకు ఇంటి చుట్టూ వ్యాపించిన దుర్వాసనే ఆ భయంకర నిజాన్ని బయటపెట్టింది. ఉద్యోగానికి వరుసగా హాజరుకాకపోవడంతో సహోద్యోగికి కలిగిన అనుమానం ఒక యువతి హత్య కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. బెంగళూరు నగర శివారులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని 20 ఏళ్ల రీమా కుమారిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమె భర్త ధీరజ్ కుమార్ ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. బెంగళూరు దక్షిణ పశ్చిమ విభాగానికి చెందిన కుంబళగోడు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన అనంతరం ధీరజ్ తన స్వస్థలమైన బిహార్కు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం రీమా, ధీరజ్ దంపతులు సుమారు ఏడాది క్రితం బిహార్ నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చారు. గెరుపాళ్య సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఇద్దరూ పనిచేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే నాలుగు నుంచి ఐదు రోజుల క్రితం ధీరజ్ తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి ఇంట్లోనే వదిలేసి తాళం వేసి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు మూసి ఉండటంతో బయటివారికి ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో మృతదేహం రోజుల తరబడి ఇంట్లోనే ఉండిపోయింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
రీమా గత కొద్ది రోజులుగా ఉద్యోగానికి రాకపోవడంతో ఆమె సహోద్యోగికి సందేహం కలిగింది. ఫోన్ ద్వారా కూడా సంప్రదించలేకపోవడంతో గురువారం నేరుగా ఆమె నివాసానికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఇంటి లోపల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటాన్ని గమనించాడు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో తాళం తెరిచి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కనిపించిన దృశ్యం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రీమా మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి మరుగుదొడ్డి సమీపంలో ఉంచినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ హత్య వెనుక అసలు కారణాలు ఏమిటి, దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదికతో పాటు వారి ఫోన్ కాల్ వివరాలు, పరిచయాలపై కూడా దృష్టి సారించారు. నిందితుడు ధీరజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్యకు దారితీసిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వలస కార్మికుల జీవితాల్లో ఎదురయ్యే కుటుంబ సమస్యలు కొన్నిసార్లు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఈ ఘటనలో నిజమైన కారణం మాత్రం దర్యాప్తు పూర్తయ్యాకే స్పష్టమవుతుంది.
- Tags
- Bengaluru Murder
- crime
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!