Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruchika Singh: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. రుచికా సింగ్ అనే ఈ యువతి వీడియోలో.. తాను 15 ఏళ్ల బాలికనని, చేతులు జోడించి దేశ ప్రజలందరికీ క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. కన్నాట్ ప్లేస్లో తిరిగిన తర్వాత స్నేహితులతో కలిసి నిరసన ప్రదర్శన వద్దకు వెళ్లానని, అక్కడ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లోనై ఆ విధమైన వ్యాఖ్యలు చేశానని ఆమె పేర్కొంది. వైరల్ వీడియోలో రుచికా మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను ఇతరుల మాటలకు ప్రభావితమయ్యానని, తాను అన్న మాటలు క్షమించరానివని ఒప్పుకుంది. ఇది తన జీవితంలో మొదటి, చివరి తప్పిదమని, తన ప్రవర్తనకు తానెంతో సిగ్గుపడుతున్నానని చెబుతూ దేశ ప్రజలను క్షమించమని కోరింది.
శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోడీ స్పందిస్తూ.. నిరసన ప్రదర్శనలో తనను దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ క్షమాపణ వీడియో బయటకు రావడం గమనార్హం. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించినప్పటికీ, యువతకు తమ తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు జూలై 29న ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ పదవి గౌరవాన్ని భంగపరిచారనే ఆరోపణలపై నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్పై ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదైంది. భారతీయ ఛాయా సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం దీనిని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
Also Read
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ "ధర్మక్షేత్ర" ముస్తాబు!
సమాచారం ప్రకారం రుచికా తన తల్లితో కలిసి నోయిడాలోని ఒక హౌసింగ్ సొసైటీలో నివాసముంటోంది. అయితే నిరసనల తర్వాత ఆమె తిరిగి రాలేదని, ప్రస్తుతం ఆ ఫ్లాట్ మూసివేసి ఉందని భద్రతా సిబ్బంది తెలిపారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకుని స్థానికులను విచారించారు. కాగా, ఈ ఎఫ్ఐఆర్పై నిరసనలను నిర్వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుచిత భాషను తాము సమర్థించమని, అయితే ఇటువంటి వ్యాఖ్యలపై క్రిమినల్ కేసులు పెట్టడం వల్ల భావప్రకటనా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ అభిప్రాయపడ్డారు. బాధితులు క్రిమినల్ చర్యలకు దిగకుండా మాననష్ట దావా వేసుకోవడం సరైన మార్గమని సూచించారు.
తాజావార్తలు
-
Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
-
Fauzi: ప్రభాస్కు తల్లిగా అలనాటి అందాల తార.. ‘ఫౌజీ’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
-
Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్పై ప్రీతి జింటా
-
Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
-
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!