NMC: ఇకపై అలా చేస్తే కోటి కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ మెడికల్ కమిషన్(NMC) చట్టబద్ధమైన నిబంధనలు, కనీస ప్రమాణాలను పాటించడంలో విఫలమైన వైద్య కళాశాలల విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. నిబంధనలు పాటించని సందర్భాల్లో ఒక్కో ఉల్లంఘనకు రూ. 1 కోటి చొప్పున జరిమానా విధించనున్నట్లు జాతీయ వైద్య మండలి తెలిపింది. ఇవేకాక వైద్య సంస్థలు ఏడాది చివరిలో సమర్పించే రికార్డ్స్, మూల్యాంకన విధానాలు, నిబంధనలకు సంబంధించి ప్రొఫెసర్స్, డీన్, డైరెక్టర్, ఫ్యాకల్టీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ వైద్య సంస్థలకు రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు అధికారికంగా ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023’ (MSMER-2023) పేరుతో విడుద చేయబడ్డాయి.
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
MSMER-2023 నిబంధనల ముఖ్య ఉద్దేశం వైద్య విద్య ప్రమాణాలను సమర్థించడం అని పేర్కొన్న ఎన్ఎంసీ.. మధ్యవర్తుల ద్వారా కమిషన్పై ప్రభావం చూపడానికి ప్రయత్నించే మెడికల్ కాలేజీల నుండి వచ్చే అన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. దీని ప్రకారం ప్రతి మెడికల్ కాలేజ్ యాన్యువల్ రిపోర్ట్ ను సమర్పించడం తప్పనిసరి. దీనిలో నివేదిక అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PGMEB), అలాగే NMC ద్వారా నిర్దేశించబడిన నియమాల ద్వారా ఏర్పాటు చేయబడిన కనీస ప్రామాణిక నిబంధనల (MSRs)కు కట్టుబడి ఉండాలి. ద్యార్థులు, వారికి సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది, వైద్యులు, వసతులు, అన్ని రకాల వ్యాధుల చికిత్సపై అవగాహన కల్పించడానికి సరిపడా రోగులు, రోగ నిర్ధారణ సౌకర్యాలు ఇలా ప్రతి ఒక్కదాని గురించి రిపోర్టలో పేర్కొనాలి. వీటిలో ఏదైనా ప్రమాణాలకు తగ్గట్టు లేకపోతే కచ్ఛితంగా ఫైన్ విధిస్తారు. ఇక తదుపరి సంవత్సరం ప్రవేశాలకు అనుమతి లభించాలంటే కూడా జాతీయ వైద్య మండలి సూచించిన అన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కొత్త కోర్సులు, వైద్య సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్బీ)ని కూడా ఎన్ఎంసీ ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!