Shiva Balakrishna : ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం చంచల్గూడ జైలుకు చేరుకుని శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైలులో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శివ బాలకృష్ణకు 10 రోజుల రిమాండ్ విధించాలని ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు అనుమతించింది. శివ బాలకృష్ణ ఎనిమిది రోజుల రిమాండ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున చంచల్గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణ పేరిట నాలుగు ఖాతాలు ఎస్బీఐ బ్యాంకులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బ్యాంకు లాకర్లను తెరిచే అవకాశం ఉంది.
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
కాగా, ఐదు రోజుల క్రితం హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో 24వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. మణికొండలోని ఆయన నివాసం, అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. 2018-2023 మధ్య కాలంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక హోదాలో పనిచేసిన శివ బాలకృష్ణ. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలు, తాజాగా వారిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అతని అరలో పదికి పైగా ఐఫోన్లు, 50 అత్యంత ఖరీదైన వాచీలు, నగదు కట్టలు, 5 కేజీల బంగారు ఆభరణాలు, 70 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. .
తాజావార్తలు
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!