Telangana: ఈనెల 17న ప్రభుత్వ కార్యాలయాలే కాదు, విద్యాసంస్థలు పూర్తిగా బంద్..!
Telangana: ఈనెల 17న ప్రభుత్వ కార్యాలయాలే కాదు, విద్యాసంస్థలు పూర్తిగా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. శ్రీరాముడి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది. కాగా.. అధికారిక క్యాలెండర్ ప్రకారం, ప్రభుత్వం ఏప్రిల్ 17 (బుధవారం) సెలవు దినంగా ప్రకటించింది. భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నాయకత్వం వహిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా పోస్ట్ చేసి ప్రకటించిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ ధూల్ పేట నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్రకు రాజాసింగ్ నాయకత్వం వహిస్తారు.
తాజాగా రాజాసింగ్ రాముని శోభయాత్ర కోసం సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి భారీ ఊరేగింపును విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సభను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు కూడా పూర్తిగా బంద్ కానున్నాయి.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
Read also: Israel-Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత కారణంగా చమురు సంక్షోభం మొదలవుతుందా?
మరోవైపు శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. కానీ రాజాసింగ్ యాత్ర సందర్భంగా ఆ మార్గాల్లో పోలీసులు అప్రమత్తం కానున్నారు. కానీ ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం రాముడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడని వారి నమ్మకం కాబట్టి.. దేశం మొత్తం శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటుంది.
దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడంతో అయోధ్యలో జరగనున్న ఉత్సవాలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరామ జన్మభూమి మందిరంలో శ్రీరాముని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో అయోధ్య ట్రస్టు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు
Kishan Reddy: ఒక వసూళ్ల రాజ్యం పోయి.. ఇంకో వసూలు రాజ్యం వచ్చింది..
తాజావార్తలు
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!