Home
Latest News
Latest News News
-
భీమిలి ప్రాంతంలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్క్ : మేకపాటి గౌతమ్రెడ్డి
ఏపీ ప్రభుత్వం నేడు ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్’ అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రిలు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్లు హజరయ్యారు. వీరితో పాటు డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిపై చర్చించినట్లు తెలిపారు.… -
ఒమిక్రాన్ వైరస్ వస్తే ఎదుర్కొంటాం : ఆళ్ల నాని
మరోసారి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్పై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోందని దీని పై సీఎం సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఒమిక్రాన్ వస్తే ఏం చేయాలనే అంశంపై సీఎం సూచనలు చేశారని ఆయన తెలిపారు.… -
బ్రేకింగ్ : ఒమిక్రాన్పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహామ్మరి కొత్తగా ఓమిక్రాన్ రూపంలో మరోసారి దేశాలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ను గుర్తించిన శాస్త్రవేత్తలు దీని వ్యాప్తి చాలా వేగంగా ఉందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. విమాన ప్రయాణాలను సైతం రద్దు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన… -
వివేకా హత్య కేసులో ట్విస్ట్.. తెరపైకి మరో వ్యక్తి
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్రెడ్డి, శంకర్రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. అంతేకాకుండా నాకు, నా… -
కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయాబచ్చన్
నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం నుంచి గందరగోళ వాతావరణంలోనే సాగింది. విపక్షాల వ్యతిరేక నినాదాలతో విసుగు చెందిన రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ.. సభను రేపటి వాయిదా వేశారు. అనంతరం పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్కు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానని, కానీ ఈ రకమైన వాతావరణాన్ని చూడటం ఇదే మొదటిసారని ఆమె అభిప్రాయం వ్యక్తం… -
బిగ్ బ్రేకింగ్: రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్.. వారు వీరే..
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం –… -
చర్చకు బీజేపీ ప్రభుత్వం భయపడుతోంది: రాహుల్ గాంధీ
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల… -
కేంద్ర బృందంతో ముగిసిన జగన్ సమావేశం
ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్రం బృందం సభ్యుడు కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. కేంద్ర బృందం తరుపున వివరాలను సీఎం జగన్కు సమర్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా వరద ప్రభావం వల్ల కడప జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. పంటలు, పశువులు కొట్టుకుపోయాయని, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిన చోట అపార నష్టం… -
అసెంబ్లీ ఘటనపై స్పందించిన స్పీకర్ తమ్మినేని
ఏపీ రాజకీయాను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసునని ఆయన వెల్లడించారు. పత్రిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సభలో రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన… -
కార్తీక దీపారాధనలో అపశ్రుతి.. మహిళ చీరకు అంటుకున్న మంటలు
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక దీపారాధనలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెనాలి మండలం చినరావూరులోని పోతురాజు స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా… వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని అనే మహిళ చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినా అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది.…
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!