కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు..…
నేడు ఏపీలో నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ జెండా ఎగరవేసింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని, అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి…
ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు ఎన్నికలు జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే వైసీపీ అభ్యర్థులు…
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. Also Read: వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఇదే కాకుండా పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు…
ఏపీలోని నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లోని మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా అందరి దృష్టి కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్లను లెక్కించి అనంతరం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు అధికారులు. అయితే ప్రారంభంలో తూర్పుగోదావరి జిల్లా ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ అందరినీ షాక్కు గురి చేసింది. ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసే సరికి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో అధికారులంతా అవాకయ్యారు. ఇదిలా ఉంటే మిగితా…
ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుంది. కుప్పంను వదులుకునే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు సైతం భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.…
నారా లోకేష్ పై నగరి ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని… కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో లోకేష్ ఒక వీధి రౌడీ మాదిరే మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. కుప్పం అభివృద్ది పట్టని చంద్రబాబు ,లోకేష్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని.. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రజలు అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కుప్పం లో ప్రజలకు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా…
కుప్పంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు సవాల్లు ప్రతి సవాల్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాతా కుప్పం 14వ వార్డుకు కౌన్సిలర్ నామినేషన్ వేసిన టీడీపీ రెండో అభ్యర్థి ప్రకాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. ఇదే వార్డుకు వెంకటేష్ అనే వ్యక్తి కూడా టీడీపీ తరుపున నామినేషన్ వేశారు. కానీ స్రూటినీలో వెంకటేశ్ నామినేషన్ సక్రమంగా లేనందువలన తొలగించబడింది.…
కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.…