ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూనగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. Also Read: లాభాల్లో ఉన్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: గుత్తా సుఖేందర్రెడ్డి నిరుపేదలకు ఇండ్లు…
తెలంగాణలో వరి పంట కొనుగోలుపై మాటల యుద్ధం సాగుతోంది. విపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీని తూర్పారబెడుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో సీఎం కేసీఆర్పై ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు. రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పారా హుషార్…
దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. 265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు…
హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మంత్రి కేటీఆర్ స్వచ్ఛ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తుందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మున్సిపాలిటీలో స్వచ్ఛ వాహనాలను ప్రారంభింస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ స్వచ్ఛతలో దేశంలోని అన్ని నగరాల కన్నా ముందు ఉందన్నారు. సీఎం కేసీఆర్…
సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడని నిజామాబాద్ లోక్ సభ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శలు చేశారు. తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని.. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడు? అని నిలదీశారు. గత మార్చి 14 నుండి భైంసాలో హిందువులపై ఎంఐఎం పార్టీ దాడులు జరిపారని… నలుగురు హిందూ వ్యక్తులను చంచల్…
2009, డిసెంబర్ 9కి తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. అప్పటికే ఆయన దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…
ఢిల్లీ లో టీ ఆర్ ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు కొట్లాడకున్నా టీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వాళ్లు మనుషులా పశువులా? బీజేపీ ఎంపీ పశువులా మమ్మల్ని బియ్యం స్మగ్లర్లు అంటున్నాడు. ఇలాగేనా రాజకీయాలు చేసేది. మేం జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకే.. ఢిల్లీ కి గుజరాత్ లకు మేము…
హైదరాబాద్ టీఆర్ఎస్ హయాంలో గ్లోబల్ సీటీగా అభివృద్ధి చెందడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ ఎఫ్ 21 వింగ్స్ తయారీ హైదరాబాద్లో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీలలో హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా ఉండటం హైదరాబాదీలకే కాదు మొత్తం తెలంగాణకే తలమానికమన్నారు కేటీఆర్. వెయ్యికి పైగా ఏరోస్పేస్ కాంపోనెంట్ పరిశ్రమలు హైదరాబాద్లోనే ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అమెరికా మరియు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ కు…
అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రగతి భవన్ లో నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారతదేశ భావి భవిష్యత్తు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక…