నాడు రికార్డు స్థాయి ఓట్లు.. నేడు ఏకగ్రీవం.. పోచంపల్లి రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి.
ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పడటం దేశంలోనే లేదని… ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ కు కేవలం 23 రాగా 12 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఈ సారి ఒకేసారి 12 స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. ఆరు ఏకగ్రీవం కాగా మరో ఆరింటికి ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. 89 శాతం ఓట్లతో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో TRS అభ్యర్థి విఠల్ విజయం సాధించారు. దీంతో పోచంపల్లి దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోచంపల్లి వివాద రహితుడు. వరికోలు శ్రీమంతుడిగా పేరుంది. ఇప్పుడు మిగతా పార్టీలకు కొంత బలం ఉన్నా పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ వేసిన వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు. ఒకసారి రికార్డు స్థాయి ఓట్లతో ఇప్పుడు ఏకగ్రీవంతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. దీంతో పార్టీలో పోచంపల్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!